ETV Bharat / state

రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

author img

By

Published : Jul 1, 2020, 8:50 PM IST

రంగారెడ్డి జిల్లా హిమాయత్‌ నగర్‌ సమీపంలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్‌ చక్రవర్తి తెలిపారు.

రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని హిమాయత్ నగర్ గ్రామ సమీపంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి హాజరయ్యారు. రక్తదానం ఒకరికి ప్రాణం ఇవ్వటం లాంటిదని ఏసీపీ అశోక్‌ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. ఎంతో అభినందనీయమైన ఈ కార్యక్రమం నిరంతరం జరిగితే ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వారవుతారని తెలిపారు.

మండలలోని యువత సామాజిక కార్యక్రమాల్లో ముందు ఉండడం చాలా సంతోషంగా ఉందని మొయినాబాద్ సీఐ జానయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులు రక్తదానం చేశారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని హిమాయత్ నగర్ గ్రామ సమీపంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి హాజరయ్యారు. రక్తదానం ఒకరికి ప్రాణం ఇవ్వటం లాంటిదని ఏసీపీ అశోక్‌ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. ఎంతో అభినందనీయమైన ఈ కార్యక్రమం నిరంతరం జరిగితే ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వారవుతారని తెలిపారు.

మండలలోని యువత సామాజిక కార్యక్రమాల్లో ముందు ఉండడం చాలా సంతోషంగా ఉందని మొయినాబాద్ సీఐ జానయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులు రక్తదానం చేశారు.

ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.