ETV Bharat / state

సికింద్రాబాద్​ కార్ఖానాలో భాజపా ఆందోళన

author img

By

Published : Feb 2, 2021, 2:15 PM IST

రాష్ట్రంలో పలు చోట్ల భాజపా కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణ నిధి సేకరణపై వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ... నేతలు క్షమాపణ చెప్పాలని నిరసన చేపట్టారు. సికింద్రాబాద్​లో భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టారు.

సికింద్రాబాద్​ కార్ఖానాలో భాజపా ఆందోళన
సికింద్రాబాద్​ కార్ఖానాలో భాజపా ఆందోళన

అయోధ్య రామమందిర నిర్మాణంపై ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భాజపా ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ కార్ఖానాలో అంబేడ్కర్​ విగ్రహం వద్ద భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. కంటోన్మెంట్ భాజపా నాయకుడు మల్లికార్జున ఆధ్వర్యంలో పలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

రామ మందిరం విషయంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినదించారు. వరంగల్​లో అరెస్టు చేసిన భాజపా నేతలను వెంటనే విడుదల చేయాలని... లేనిచో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై హెచ్​ఆర్​సీలో ఫిర్యాదు

అయోధ్య రామమందిర నిర్మాణంపై ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భాజపా ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ కార్ఖానాలో అంబేడ్కర్​ విగ్రహం వద్ద భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. కంటోన్మెంట్ భాజపా నాయకుడు మల్లికార్జున ఆధ్వర్యంలో పలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

రామ మందిరం విషయంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినదించారు. వరంగల్​లో అరెస్టు చేసిన భాజపా నేతలను వెంటనే విడుదల చేయాలని... లేనిచో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై హెచ్​ఆర్​సీలో ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.