ETV Bharat / state

నాగార్జునసాగర్​ అభ్యర్థిపై తేల్చుకోలేకపోతున్న కమలనాథులు

author img

By

Published : Mar 18, 2021, 8:01 PM IST

నాగార్జున సాగర్​ ఉపఎన్నికపై కమలదళం కసరత్తు ముమ్మరం చేస్తోంది. అభ్యర్థి ఎంపికపై భాజపా నేతలు తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే సాగర్​ టికెట్​పై పలువురు బండి సంజయ్​ను కలిసి విజ్ఞప్తి చేశారు.

అభ్యర్థి ఎంపికపై తేల్చుకోలేకపోతున్న కమలనాథులు
అభ్యర్థి ఎంపికపై తేల్చుకోలేకపోతున్న కమలనాథులు

నాగార్జున సాగర్ ఉపఎన్నికపై భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ కసరత్తు ముమ్మరం చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నల్గొండ జిల్లా పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారు. అభ్యర్థి ఎంపికపై కమలనాథులు ఎటూ తేల్చుకోలేకపోతోన్నారు. తెరాస తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతనే భాజపా అభ్యర్థిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు.

బండి సంజయ్​ను కలిసి టికెట్ కేటాయించాలని కడారి అంజయ్య యాదవ్‌తో పాటు పలువురు ఆశావాహులు కోరారు. దశాబ్ద కాలంగా పార్టీని భుజాలపై మోస్తోన్న తమకే టికెట్ కేటాయించాలని కంకణాల నివేదితారెడ్డి దంపతులు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ సాగర్ టికెట్​పై బండి సంజయ్ నుంచి ఆశావాహులకు ఎలాంటి హామీ లభించలేదు.

నాగార్జున సాగర్ ఉపఎన్నికపై భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ కసరత్తు ముమ్మరం చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నల్గొండ జిల్లా పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారు. అభ్యర్థి ఎంపికపై కమలనాథులు ఎటూ తేల్చుకోలేకపోతోన్నారు. తెరాస తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతనే భాజపా అభ్యర్థిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు.

బండి సంజయ్​ను కలిసి టికెట్ కేటాయించాలని కడారి అంజయ్య యాదవ్‌తో పాటు పలువురు ఆశావాహులు కోరారు. దశాబ్ద కాలంగా పార్టీని భుజాలపై మోస్తోన్న తమకే టికెట్ కేటాయించాలని కంకణాల నివేదితారెడ్డి దంపతులు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ సాగర్ టికెట్​పై బండి సంజయ్ నుంచి ఆశావాహులకు ఎలాంటి హామీ లభించలేదు.

ఇదీ చదవండి: 'ఓయూ, నిరుద్యోగులకు ఒక్క రూపాయి కేటాయించలేదు: భాజపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.