నిమ్స్లో ఆరుగురికి కరోనా
నిమ్స్లో నలుగురు వైద్యులు, ఒక ప్రొఫెసర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. నిమ్స్ కార్డియాలజీ విభాగంలో నలుగురు రెసిడెంట్ వైద్యులకు వైరస్ సోకింది. ఇవాళ ఎంత మందికి పరీక్షలు నిర్వహించారంటే...
తెలంగాణకు 34, ఏపీకి 66 శాతం
కొత్త ప్రాజెక్టులకు సంబంధించి రెండు రాష్ట్రాలు డీపీఆర్లు ఇవ్వాలని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. తెలంగాణ, ఏపీ.. 34: 66 నిష్పత్తిలో కృష్ణా జలాలు వాడుకోవాలని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఇంకేమందంటే..
ఈనెల 20 నుంచి బీటెక్, బీఫార్మసీ పరీక్షలు
ఇంజినీరింగ్, బీఫార్మసీ పరీక్షలపై జేఎన్టీయూహెచ్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈనెల 20 నుంచి బీటెక్, బీఫార్మసీ చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. సెమిస్టర్ పరీక్షల సమయాన్ని ఎంతకు కుదించిందంటే..
కోర్టుకు గొర్రెకుంట సామూహిక హత్యల నిందితుడు
వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంటలో 9 మందిని హత్య చేసిన నిందితుడు సంజయ్కుమార్ను పోలీసులు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితుడికి 14 రోజుల వరకు రిమాండ్ విధించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఎలా అడ్డుకుంటారు
కేసీఆర్ కొండ పోచమ్మ వద్ద వందల మందితో ప్రారంభోత్సవాలు నిర్వహిస్తే తప్పు లేదు కానీ.. ప్రాజెక్టుల వద్ద మేము తిరిగితే తప్పెలా అవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఇంకేమన్నారంటే..
భారత దౌత్యాధికారికి పాక్ ఐఎస్ఐ వేధింపులు
పాకిస్థాన్లో భారత సీనియర్ దౌత్య వేత్త గౌరవ్ అహ్లువాలియాను ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ సభ్యులు వేధిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
మేలు చేసిన 'నిసర్గ!
'నిసర్గ' తుపాను కారణంగా ముంబయిలో గాలి నాణ్యత మెరుగుపడినట్లు అధికారులు తెలిపారు. అధిక వేగంతో వీచిన గాలులు, వర్షాల వల్ల నగరంలో గాలి నాణ్యత సూచీ 17కు చేరినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
మార్కెట్లోకి వచ్చే కొత్త బైక్లు ఇవే!
ఈ నెల 8 నుంచి షోరూమ్లు పూర్తిస్థాయిలో తెరుచుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నద్ధమయ్యాయి ఆటోమొబైల్ కంపెనీలు. ఆ వివరాలు మీకోసం..
'ఇంట్లో ఉండటం వల్ల దురద పుడుతోంది'
లాక్డౌన్తో ఇంట్లోనే ఉన్న తనకు, క్రికెట్ ఆడకపోవడం వల్ల దురద పుడుతోందని చెప్పాడు బౌలర్ అశ్విన్. ఇంకేమన్నాడంటే..
మెగాస్టార్ కోసం ప్రత్యేక షో!
మెగాస్టార్ చిరు కోసం 'ఉప్పెన' సినిమా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఈ చిత్రంతో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.