ETV Bharat / state

కొవిడ్​ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: భట్టి - కొవిడ్​ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని భట్టి డిమాండ2

రాష్ట్రంలో మారుమూల పల్లెలకు కొవిడ్​ వ్యాపించిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గ్రామీణ ప్రజలు కొవిడ్​కు మెరుగైన వైద్యం చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్​ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్​ చేశారు.

batti vikramarka
batti vikramarka
author img

By

Published : May 11, 2021, 4:54 PM IST

కొవిడ్​ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కొవిడ్​ బారిన పడిన గ్రామీణ ప్రజలు సరైన చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో సీనియర్‌ అధికారులతో మానిటరింగ్‌ కమిటీ వేసి... కొవిడ్​ వ్యాక్సిన్​ ప్రక్రియ, చికిత్స, మందుల లభ్యత తదితర అంశాలను పరిశీలించాలని సూచించారు. దిల్లీ మాదిరిగా యాప్​ను అభివృద్ధి చేసి ఆస్పత్రుల వారీగా పడకల లభ్యత, ఆక్సిజన్​ బెడ్లు, వెంటిలేటర్లు తదితర వివరాలు పొందుపరచాలని పేర్కొన్నారు.

జిల్లా స్థాయిలో కూడా మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కమిటీ జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో పనిచేసేట్లు చూడాలన్నారు. అవసరమైతే అన్ని పనులు పక్కన పెట్టి కొవిడ్​ కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రతి నియోజక వర్గం కేంద్రంలో... క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో ఆక్సిజన్​తో కూడిన 30 బెడ్లు ఉన్న కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

కొవిడ్​ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కొవిడ్​ బారిన పడిన గ్రామీణ ప్రజలు సరైన చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో సీనియర్‌ అధికారులతో మానిటరింగ్‌ కమిటీ వేసి... కొవిడ్​ వ్యాక్సిన్​ ప్రక్రియ, చికిత్స, మందుల లభ్యత తదితర అంశాలను పరిశీలించాలని సూచించారు. దిల్లీ మాదిరిగా యాప్​ను అభివృద్ధి చేసి ఆస్పత్రుల వారీగా పడకల లభ్యత, ఆక్సిజన్​ బెడ్లు, వెంటిలేటర్లు తదితర వివరాలు పొందుపరచాలని పేర్కొన్నారు.

జిల్లా స్థాయిలో కూడా మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కమిటీ జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో పనిచేసేట్లు చూడాలన్నారు. అవసరమైతే అన్ని పనులు పక్కన పెట్టి కొవిడ్​ కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రతి నియోజక వర్గం కేంద్రంలో... క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో ఆక్సిజన్​తో కూడిన 30 బెడ్లు ఉన్న కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి: రేపట్నుంచి 10 రోజులపాటు రాష్ట్రంలో లాక్‌డౌన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.