ETV Bharat / state

Bangladesh Robbery Gang : పైన, కింద 100 డాలర్ నోట్లు ఉంచి రూ.8 లక్షలు నొక్కేశారు

author img

By

Published : May 28, 2023, 10:43 AM IST

Updated : May 28, 2023, 11:33 AM IST

Bangladesh Robbery Gang Looted 8 Lkahs from Hyderabad : ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చి దోపిడీలు, దొంగతనాలు చేయడం ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు విదేశాల నుంచి వచ్చి సైతం చోరీలకు పాల్పడుతున్నారు. బంగ్లాదేశ్​కు చెందిన ముఠా సభ్యులు డాలర్లను రూపాయల్లోకి మార్చాలంటూ రూ.8 లక్షలు కొట్టేసి పరారైన ఘటన హైదరాబాద్​లో ఆలస్యంగా వెలుగుచూసింది.

Bangladesh  Robbery Gang Looted 8 Lkahs from Hyderabad
తల్లి సెంటిమెంట్​తో రూ.8 లక్షలు చోరీ

Bangladesh Robbery Gang Looted 8 Lkahs from Hyderabad : కూకట్​పల్లిలో విదేశీ నగదు మార్పిడి ఓ సంస్థలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరు వ్యక్తులు ఏజెన్సీలోకి ప్రవేశించి ఏజెన్సీ ప్రతినిధితో పరిచయం చేసుకున్నారు. తమ దగ్గర డాలర్లు ఉన్నాయని వాటి బదులు భారతీయ కరెన్సీ అవసరముందని చెప్పారు. నమ్మిన ఉద్యోగి వారి నుంచి డాలర్లు తీసుకొని మన కరెన్సీ ఇచ్చారు. ఇలా రెండు దఫాలు 500 డాలర్ల నగదు మార్పిడి చేసుకొంటూ ఉద్యోగితో పరిచయం పెంచుకున్నారు. నమ్మకం కుదిరిందని భావించిన నేరగాళ్లు మూడోసారి తమ పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

Foreign currency exchnage office : నేరుగా ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లకుండా తమ తల్లి అనారోగ్యానికి గురైందని, వెంటనే 8 లక్షలు డబ్బు అవసరముందంటూ ఏజెన్సీ ప్రతినిధికి ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. తాముండే ప్రాంతానికి వచ్చి డాలర్లు తీసుకుని నగదు ఇవ్వాలని కోరారు. నమ్మిన ఉద్యోగి రూ.8 లక్షల నగదును తమ కుమారుడికి ఇచ్చి పంపారు. నిందితులు మొత్తం సొమ్ము ఇవ్వకుండా నోట్ల కట్ట పైన, కింద 100 డాలర్ల నోట్లు ఉంచి మధ్యలో మాత్రం ఒక డాలర్ నోట్లు 38 ఉంచారు. ఉద్యోగి కుమారుడు ఇవేవీ గమనించలేదు. నిందితులు 8.లక్షలు తీసుకుని వెళ్లిపోయారు. ఉద్యోగి కుమారుడు డబ్బు తీసుకెళ్లి ఇంట్లో పెట్టాడు.

నోట్ల పరిమాణం ఒకేలా ఉండటంతో : మరుసటి రోజు అతని తండ్రి గమనించారు. పైన కింద మాత్రమే 100 డాలర్ల నోట్లు రెండు ఉన్నాయిని గుర్తించారు. మిగిలినవన్నీ ఒక్క డాలర్ నోట్లు మాత్రమే కావడంతో కంగుతిని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మన దేశ కరెన్సీలా కాకుండా అమెరికాలో నోట్ల పరిమాణం ఒకేలా ఉంటుంది. 100 డాలర్లయినా.. ఒక డాలర్ నోటైనా పరిమాణం ఒకే సైజులో ఉంటాయి. దీన్నే ఆ నిందితులు ఆసరాగా చేసుకుని డబ్బు కొట్టేశారని పోలీసులు అంచనాకు వచ్చారు.

బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముఠా : కూకట్​పల్లి పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితులు వినియోగించిన కారు వివరాల ఆధారంగా ప్రత్యేక బృందం వెళ్లి కారు డ్రైవరును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతనిచ్చిన వివరాల ఆధారంగా నిందితులిద్దరూ బంగ్లాదేశీయులని తేల్చారు. నిందితులు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి దిల్లీకి వచ్చారని అక్కడ క్యాబ్ డ్రైవరును మాట్లాడుకుని నేరుగా హైదరాబాద్ వచ్చారని పోలీసులు గుర్తించారు. ఇక్కడ డబ్బు కొట్టేశాక నేరుగా చెన్నై వెళ్లారు. అక్కడి నుంచి కలకత్తా వెళ్లి అక్కడ నుంచి బంగ్లాదేశ్ పారిపోయారని తెలిసింది. పోలీసులు నిందితుల పాస్​పోర్టు, ఇతర వివరాలు సేకరించారు. లుకౌట్ సర్క్యులర్ జారీ చేశామని వెల్లడించారు.

వెంటనే అరెస్టవుతారు : బంగ్లాదేశ్ నుంచి నిందితులు మరోసారి దేశంలో అడుగుపెడితే వెంటనే అరెస్టవుతారని పోలీసులు చెప్పారు. దృష్టి మళ్లించి డబ్బు కొట్టేసిన బంగ్లాదేశీ ముఠా నగరంలో ఇంకా ఏమైనా చోరీలు చేసిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరికీ కలిపి విమాన చార్జీలు, ప్రయాణ ఖర్చులు అన్నీ కలిపి ఒక విడతకు లక్ష దాకా ఖర్చవుతుందని పోలిసులు అంచనా వేశారు. రూ.10 లక్షల దోపిడీ కోసమే మరో దేశం నుంచి వచ్చారా.. అని పోలీసులు అనుమానిస్తున్నారు నిందితులు చెన్నై, దిల్లీ, కలకత్తాలోనూ సంచరించారు. అక్కడా దోపిడీలు చేసి ఉంటారని భావిస్తున్నారు. నిందితుల వివరాలను వేర్వేరు కమిషనరేట్లకు పంపించి ఆరా తీస్తున్నామని పోలీసులు వివరించారు.

ఇవీ చదవండి:

Bangladesh Robbery Gang Looted 8 Lkahs from Hyderabad : కూకట్​పల్లిలో విదేశీ నగదు మార్పిడి ఓ సంస్థలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరు వ్యక్తులు ఏజెన్సీలోకి ప్రవేశించి ఏజెన్సీ ప్రతినిధితో పరిచయం చేసుకున్నారు. తమ దగ్గర డాలర్లు ఉన్నాయని వాటి బదులు భారతీయ కరెన్సీ అవసరముందని చెప్పారు. నమ్మిన ఉద్యోగి వారి నుంచి డాలర్లు తీసుకొని మన కరెన్సీ ఇచ్చారు. ఇలా రెండు దఫాలు 500 డాలర్ల నగదు మార్పిడి చేసుకొంటూ ఉద్యోగితో పరిచయం పెంచుకున్నారు. నమ్మకం కుదిరిందని భావించిన నేరగాళ్లు మూడోసారి తమ పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

Foreign currency exchnage office : నేరుగా ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లకుండా తమ తల్లి అనారోగ్యానికి గురైందని, వెంటనే 8 లక్షలు డబ్బు అవసరముందంటూ ఏజెన్సీ ప్రతినిధికి ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. తాముండే ప్రాంతానికి వచ్చి డాలర్లు తీసుకుని నగదు ఇవ్వాలని కోరారు. నమ్మిన ఉద్యోగి రూ.8 లక్షల నగదును తమ కుమారుడికి ఇచ్చి పంపారు. నిందితులు మొత్తం సొమ్ము ఇవ్వకుండా నోట్ల కట్ట పైన, కింద 100 డాలర్ల నోట్లు ఉంచి మధ్యలో మాత్రం ఒక డాలర్ నోట్లు 38 ఉంచారు. ఉద్యోగి కుమారుడు ఇవేవీ గమనించలేదు. నిందితులు 8.లక్షలు తీసుకుని వెళ్లిపోయారు. ఉద్యోగి కుమారుడు డబ్బు తీసుకెళ్లి ఇంట్లో పెట్టాడు.

నోట్ల పరిమాణం ఒకేలా ఉండటంతో : మరుసటి రోజు అతని తండ్రి గమనించారు. పైన కింద మాత్రమే 100 డాలర్ల నోట్లు రెండు ఉన్నాయిని గుర్తించారు. మిగిలినవన్నీ ఒక్క డాలర్ నోట్లు మాత్రమే కావడంతో కంగుతిని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మన దేశ కరెన్సీలా కాకుండా అమెరికాలో నోట్ల పరిమాణం ఒకేలా ఉంటుంది. 100 డాలర్లయినా.. ఒక డాలర్ నోటైనా పరిమాణం ఒకే సైజులో ఉంటాయి. దీన్నే ఆ నిందితులు ఆసరాగా చేసుకుని డబ్బు కొట్టేశారని పోలీసులు అంచనాకు వచ్చారు.

బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముఠా : కూకట్​పల్లి పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితులు వినియోగించిన కారు వివరాల ఆధారంగా ప్రత్యేక బృందం వెళ్లి కారు డ్రైవరును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతనిచ్చిన వివరాల ఆధారంగా నిందితులిద్దరూ బంగ్లాదేశీయులని తేల్చారు. నిందితులు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి దిల్లీకి వచ్చారని అక్కడ క్యాబ్ డ్రైవరును మాట్లాడుకుని నేరుగా హైదరాబాద్ వచ్చారని పోలీసులు గుర్తించారు. ఇక్కడ డబ్బు కొట్టేశాక నేరుగా చెన్నై వెళ్లారు. అక్కడి నుంచి కలకత్తా వెళ్లి అక్కడ నుంచి బంగ్లాదేశ్ పారిపోయారని తెలిసింది. పోలీసులు నిందితుల పాస్​పోర్టు, ఇతర వివరాలు సేకరించారు. లుకౌట్ సర్క్యులర్ జారీ చేశామని వెల్లడించారు.

వెంటనే అరెస్టవుతారు : బంగ్లాదేశ్ నుంచి నిందితులు మరోసారి దేశంలో అడుగుపెడితే వెంటనే అరెస్టవుతారని పోలీసులు చెప్పారు. దృష్టి మళ్లించి డబ్బు కొట్టేసిన బంగ్లాదేశీ ముఠా నగరంలో ఇంకా ఏమైనా చోరీలు చేసిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరికీ కలిపి విమాన చార్జీలు, ప్రయాణ ఖర్చులు అన్నీ కలిపి ఒక విడతకు లక్ష దాకా ఖర్చవుతుందని పోలిసులు అంచనా వేశారు. రూ.10 లక్షల దోపిడీ కోసమే మరో దేశం నుంచి వచ్చారా.. అని పోలీసులు అనుమానిస్తున్నారు నిందితులు చెన్నై, దిల్లీ, కలకత్తాలోనూ సంచరించారు. అక్కడా దోపిడీలు చేసి ఉంటారని భావిస్తున్నారు. నిందితుల వివరాలను వేర్వేరు కమిషనరేట్లకు పంపించి ఆరా తీస్తున్నామని పోలీసులు వివరించారు.

ఇవీ చదవండి:

Last Updated : May 28, 2023, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.