World Kidney Day: ప్రపంచ కిడ్నీ దినోత్సవం పురస్కరించుకొని ఎల్బీనగర్లోని అవేర్ గ్లెనీగెల్స్ గ్లోబల్ ఆసుపత్రి సరికొత్త ప్యాకేజీని ప్రారంభించింది. కేవలం రూ.100కే జీఎస్ఆర్ పరీక్ష చేయనున్నట్టు ప్రకటించింది. ఈ పరీక్ష ద్వారా కిడ్నీల పనితీరు తెలుసుకోవచ్చని డాక్టర్ సత్వీందర్ సింగ్ సబర్వాల్ తెలిపారు.
దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలతో ఉన్న వందశాతం మందిలో ముప్పై శాతం మంది డయాలసిస్తో బాధపడుతున్నారు. వారిని ముందే గుర్తించినట్లయితే తగిన వైద్యం చేయవచ్చని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి మార్చి నెలాఖరు వరకు ప్యాకేజీ అమలులో ఉంటుందని తెలియచేశారు.
ఇదీ చదవండి: Neem Tree Drying: తెలుగు రాష్ట్రాల్లో ఎండిపోతున్న వేపచెట్లు... రక్షించుకుందామిలా..!!