హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారు మైసమ్మ దేవాలయం పక్కన ఉన్న ఐసీఐసీఐ, ఆక్సిస్ బ్యాంక్ ఏటీఎంలపై గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. సమాచారం అందుకున్న మీర్ చౌక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నిప్పు ఆర్పివేశారు.
గుర్తు తెలియని వ్యక్తి రాత్రి 3.20 గంటలకు ఐసీఐసీఐ, ఆక్సిస్ బ్యాంకుల ఏటిఎంలపై ఇంజన్ ఆయిల్ పోసి నిప్పు అంటించినట్లు మీర్ చౌక్ ఏసీపీ ఆనంద్ తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వెంటనే అప్రమత్తమైన చాంద్రాయణగుట్ట పోలీసులు పెద్ద ఘటన జరగకుండా నివారించగలిగారు. బ్యాంక్ మేనేజర్లకు సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి పోలీసులకు సహకరించారు.