ETV Bharat / state

AP Governor tested positive: ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు కరోనా నిర్ధరణ

author img

By

Published : Nov 17, 2021, 5:47 PM IST

Updated : Nov 17, 2021, 7:17 PM IST

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు ఏఐజీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ నెల 15న వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు.

ap governor
ap governor

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్​కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ(Governor Biswabhusan Harichandan tested covid positive) అయింది. ఈ నెల 15న జరిపిన పరీక్షల్లో గవర్నర్​కు కొవిడ్​ సోకినట్లు తెలిందని హైదరాబాద్​లోని ఏఐజీ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి(Ap Governor Biswabhusan Admitted AIG Hospital at hyderabad) నిలకడగా ఉందని.. గవర్నర్​ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు కరోనా నిర్ధరణ
ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు కరోనా నిర్ధరణ

గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ (AP governor) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో గవర్నర్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స(Governor Biswabhusan Harichandan Admitted AIG Hospital at hyderabad) అందిస్తున్నారు. నిన్న ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా.. ఇవాళ కొవిడ్ పాజిటివ్​గా తెలింది.

తెలంగాణ గవర్నర్‌ పరామర్శ..

గవర్నర్‌ బిశ్వభూషణ్​ను తెలంగాణ గవర్నర్ తమిళిసై పరామర్శించారు. ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన గవర్నర్​ ఆయన ఆరోగ్యం ఎలా ఉందని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బిశ్వభూషణ్‌ త్వరగా కోలుకోవాలని దేశానికి సేవ చేయాలని తమిళి సై కోరుకున్నారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి కూడా బిశ్వభూషణ్ ఆరోగ్యం గురించి ఆసుపత్రికి ఫోన్ చేసి కనుక్కున్నారు.

తెలంగాణ గవర్నర్‌ పరామర్శ..

ఇదీ చదంవడి..

AP governor: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు అస్వస్థత

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్​కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ(Governor Biswabhusan Harichandan tested covid positive) అయింది. ఈ నెల 15న జరిపిన పరీక్షల్లో గవర్నర్​కు కొవిడ్​ సోకినట్లు తెలిందని హైదరాబాద్​లోని ఏఐజీ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి(Ap Governor Biswabhusan Admitted AIG Hospital at hyderabad) నిలకడగా ఉందని.. గవర్నర్​ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు కరోనా నిర్ధరణ
ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు కరోనా నిర్ధరణ

గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ (AP governor) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో గవర్నర్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స(Governor Biswabhusan Harichandan Admitted AIG Hospital at hyderabad) అందిస్తున్నారు. నిన్న ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా.. ఇవాళ కొవిడ్ పాజిటివ్​గా తెలింది.

తెలంగాణ గవర్నర్‌ పరామర్శ..

గవర్నర్‌ బిశ్వభూషణ్​ను తెలంగాణ గవర్నర్ తమిళిసై పరామర్శించారు. ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన గవర్నర్​ ఆయన ఆరోగ్యం ఎలా ఉందని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బిశ్వభూషణ్‌ త్వరగా కోలుకోవాలని దేశానికి సేవ చేయాలని తమిళి సై కోరుకున్నారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి కూడా బిశ్వభూషణ్ ఆరోగ్యం గురించి ఆసుపత్రికి ఫోన్ చేసి కనుక్కున్నారు.

తెలంగాణ గవర్నర్‌ పరామర్శ..

ఇదీ చదంవడి..

AP governor: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు అస్వస్థత

Last Updated : Nov 17, 2021, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.