ETV Bharat / state

KRMB: 50:50 నిష్పత్తిలో నీటి పంపకం సాధ్యం కాదని ఏపీ సర్కారు లేఖ - కృష్ణానది జల వివాదం

KRMB
KRMB
author img

By

Published : Aug 25, 2021, 12:57 PM IST

Updated : Aug 25, 2021, 1:15 PM IST

12:56 August 25

KRMB: కృష్ణా జలాల పంపకాలపై కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

కృష్ణా జలాల పంపకాలపై కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. 2021-22కి 70:30 నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని కోరింది. రెండో ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం నీటి పంపకాలు జరగాలని పేర్కొంది. 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు చేయాలంటూ తెలంగాణ రాసిన లేఖపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు... ఏపీ అభిప్రాయం కోరింది. ఈ మేరకు ఏపీ నీటిపారుదలశాఖ అధికారులు సమాధానమిచ్చారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని లేఖలో స్పష్టం చేశారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి చెన్నైకి, హైదరబాద్ నగరానికి తాగునీటి సరఫరా విషయంలో మాత్రమే కొన్ని నిబంధనల్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. నాగార్జునసాగర్​లో విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి అవసరాల కోసం ప్రకాశం బ్యారేజీకి నీటి సరఫరా విషయంలో మాత్రమే ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టుల వారీగా కొన్ని నిర్ణయాలు చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు. పునర్విభజన చట్టంలో ఏపీ అవసరాల కోసం 1059 టీఎంసీలు కావాలని ట్రైబ్యునల్‌కు విజ్ఞప్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దశలో 50-50 నిష్పత్తిలో నీటి పంపకాల కోసం తెలంగాణ డిమాండ్ సహేతుకం కాదని ఏపీ అధికారులు పేర్కొన్నారు.

12:56 August 25

KRMB: కృష్ణా జలాల పంపకాలపై కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

కృష్ణా జలాల పంపకాలపై కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. 2021-22కి 70:30 నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని కోరింది. రెండో ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం నీటి పంపకాలు జరగాలని పేర్కొంది. 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు చేయాలంటూ తెలంగాణ రాసిన లేఖపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు... ఏపీ అభిప్రాయం కోరింది. ఈ మేరకు ఏపీ నీటిపారుదలశాఖ అధికారులు సమాధానమిచ్చారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని లేఖలో స్పష్టం చేశారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి చెన్నైకి, హైదరబాద్ నగరానికి తాగునీటి సరఫరా విషయంలో మాత్రమే కొన్ని నిబంధనల్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. నాగార్జునసాగర్​లో విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి అవసరాల కోసం ప్రకాశం బ్యారేజీకి నీటి సరఫరా విషయంలో మాత్రమే ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టుల వారీగా కొన్ని నిర్ణయాలు చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు. పునర్విభజన చట్టంలో ఏపీ అవసరాల కోసం 1059 టీఎంసీలు కావాలని ట్రైబ్యునల్‌కు విజ్ఞప్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దశలో 50-50 నిష్పత్తిలో నీటి పంపకాల కోసం తెలంగాణ డిమాండ్ సహేతుకం కాదని ఏపీ అధికారులు పేర్కొన్నారు.

Last Updated : Aug 25, 2021, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.