ETV Bharat / state

మళ్లీ ఎంసెట్ పరీక్ష.. సర్కార్ కీలక నిర్ణయం!

author img

By

Published : Oct 3, 2020, 7:57 PM IST

కరోనా కారణంగా ఎంసెట్ రాయలేకపోయిన విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి మళ్లీ ఎంసెట్ రాసే అవకాశం కల్పించింది.

Telangana eamset 2020
మళ్లీ ఎంసెట్ పరీక్ష.. సర్కార్ కీలక నిర్ణయం!

కరోనా వల్ల ఎంసెట్​ రాయలేక పోయిన విద్యార్థుల కోసం ప్రత్యేక ఎంసెట్​ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కారణంగా పరీక్ష రాయలేక పోయిన విద్యార్థులు ఈనెల 5 వరకు వివరాలు సమర్పించాలని ఎంసెట్​ కన్వీనర్​ ప్రొఫెసర్​ గోవర్ధన్​ తెలిపారు.

ఆగష్టు 17 నుంచి సెప్టెంబరు 14 మధ్య కరోనా సోకి.. ఆ కారణంగా ఎంసెట్​ రాయలేక పోయిన వారికి ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తామని కన్వీనర్ పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు కరోనా పాజిటివ్, నెగెటివ్ రిపోర్టులు, హాల్​టికెట్​తో పాటు.. వెబ్​సైట్​లోని అండర్ టేకింగ్​ను సమర్పించాలని తెలిపారు. అభ్యర్థులు convenertseamcet2020@jntuh.ac.in కు మెయిల్ ద్వారా వివరాలు పంపించాలని కన్వీనర్ తెలిపారు. ప్రత్యేక పరీక్ష తేదీలను తర్వాత వెల్లడిస్తామన్నారు.

కరోనా వల్ల ఎంసెట్​ రాయలేక పోయిన విద్యార్థుల కోసం ప్రత్యేక ఎంసెట్​ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కారణంగా పరీక్ష రాయలేక పోయిన విద్యార్థులు ఈనెల 5 వరకు వివరాలు సమర్పించాలని ఎంసెట్​ కన్వీనర్​ ప్రొఫెసర్​ గోవర్ధన్​ తెలిపారు.

ఆగష్టు 17 నుంచి సెప్టెంబరు 14 మధ్య కరోనా సోకి.. ఆ కారణంగా ఎంసెట్​ రాయలేక పోయిన వారికి ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తామని కన్వీనర్ పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు కరోనా పాజిటివ్, నెగెటివ్ రిపోర్టులు, హాల్​టికెట్​తో పాటు.. వెబ్​సైట్​లోని అండర్ టేకింగ్​ను సమర్పించాలని తెలిపారు. అభ్యర్థులు convenertseamcet2020@jntuh.ac.in కు మెయిల్ ద్వారా వివరాలు పంపించాలని కన్వీనర్ తెలిపారు. ప్రత్యేక పరీక్ష తేదీలను తర్వాత వెల్లడిస్తామన్నారు.

ఇదీ చదవండి: సమష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు: కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.