ETV Bharat / state

పనులను త్వరగా పూర్తి చేయండి: తలసాని - హైదరాబాద్​ తాజా వార్తలు

సనత్​నగర్ నియోజకవర్గం పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అధికారులను ఆదేశించారు. బుధవారం మాసాబ్ ట్యాంక్​లోని తన కార్యాలయంలో రెవెన్యూ, హౌసింగ్, ఎలక్ట్రికల్ శాఖల అధికారులతో సమీక్షించారు.

animal husbandry minister talasani srinivas yadav review on double bed room houses in hyderabad
పనులను త్వరగా పూర్తి చేయండి: తలసాని
author img

By

Published : Dec 30, 2020, 5:20 PM IST

పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయాలనే సంకల్పంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ అన్నారు. బుధవారం మాసాబ్ ట్యాంక్​లోని తన కార్యాలయంలో సనత్​నగర్ నియోజకవర్గం పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులపై అధికారులతో సమీక్షించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సనత్​నగర్ నియోజకవర్గంలోని అంబేడ్కర్​నగర్, జీవైఆర్​ కాంపౌండ్, బండ మైసమ్మనగర్, చాచా నెహ్రూనగర్, పొట్టి శ్రీరాములునగర్, గొల్ల కొమరయ్య కాలనీల్లో 105.46 కోట్ల రూపాయల వ్యయంతో 1,258 ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. రాంగోపాల్​పేట డివిజన్​లో 330 ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టగా 80 శాతం పనులు జరిగాయని, 45 రోజుల్లో మిగిలిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

బన్సీలాల్​పేట డివిజన్ బండ మైసమ్మనగర్​లో 310, జీవైఆర్​ కాంపౌండ్​లో 180 ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. వీటిని వచ్చే ఏడాది మార్చి నెల నాటికి పూర్తి చేస్తామన్నారు. పొట్టి శ్రీరాములునగర్​లో 15 రోజుల్లో ఇళ్లు పూర్తవుతాయని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలుంటే రెవెన్యూ, హౌసింగ్, టౌన్ ప్లానింగ్ శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్న ప్రాంతంలో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎలెక్ట్రికల్ అధికారులను ఆదేశించారు. బన్సీలాల్​పేట డివిజన్ పరిధిలోని బర్కల బాలయ్య దొడ్డి స్థలంలో 28 కుటుంబాలు సుమారు 75 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారని.. తగు విచారణ జరిపి వారికి పొజిషన్ సర్టిఫికెట్లను ఇవ్వాలని ఆర్డీవో వసంత కుమారిని ఆదేశించారు.

ఇదీ చదవండి: లైవ్ వీడియో: తెరాస, భాజపాల బాహాబాహీ..

పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయాలనే సంకల్పంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ అన్నారు. బుధవారం మాసాబ్ ట్యాంక్​లోని తన కార్యాలయంలో సనత్​నగర్ నియోజకవర్గం పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులపై అధికారులతో సమీక్షించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సనత్​నగర్ నియోజకవర్గంలోని అంబేడ్కర్​నగర్, జీవైఆర్​ కాంపౌండ్, బండ మైసమ్మనగర్, చాచా నెహ్రూనగర్, పొట్టి శ్రీరాములునగర్, గొల్ల కొమరయ్య కాలనీల్లో 105.46 కోట్ల రూపాయల వ్యయంతో 1,258 ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. రాంగోపాల్​పేట డివిజన్​లో 330 ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టగా 80 శాతం పనులు జరిగాయని, 45 రోజుల్లో మిగిలిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

బన్సీలాల్​పేట డివిజన్ బండ మైసమ్మనగర్​లో 310, జీవైఆర్​ కాంపౌండ్​లో 180 ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. వీటిని వచ్చే ఏడాది మార్చి నెల నాటికి పూర్తి చేస్తామన్నారు. పొట్టి శ్రీరాములునగర్​లో 15 రోజుల్లో ఇళ్లు పూర్తవుతాయని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలుంటే రెవెన్యూ, హౌసింగ్, టౌన్ ప్లానింగ్ శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్న ప్రాంతంలో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎలెక్ట్రికల్ అధికారులను ఆదేశించారు. బన్సీలాల్​పేట డివిజన్ పరిధిలోని బర్కల బాలయ్య దొడ్డి స్థలంలో 28 కుటుంబాలు సుమారు 75 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారని.. తగు విచారణ జరిపి వారికి పొజిషన్ సర్టిఫికెట్లను ఇవ్వాలని ఆర్డీవో వసంత కుమారిని ఆదేశించారు.

ఇదీ చదవండి: లైవ్ వీడియో: తెరాస, భాజపాల బాహాబాహీ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.