ETV Bharat / state

అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్‌.. ఎంతంటే..?

author img

By

Published : Dec 16, 2022, 10:20 AM IST

Andhra Pradesh Debts : ఏపీ ప్రభుత్వ అప్పులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కనీసం జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న ప్రభుత్వ దీనస్థితి సామాన్యులకు సైతం ఇప్పుడిప్పుడే అవగతమవుతోంది. అప్పు తెచ్చి ఆస్తి సృష్టించకుండా ఖర్చులు చేయడం కలవరపరుస్తోంది.

Andhra Pradesh
Andhra Pradesh

అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్‌.. ఎంతంటే

Andhra Pradesh Debts : ఆంధ్రప్రదేశ్​లో ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో సాధారణ ప్రజలకు సైతం అనుభవంలోకి వస్తోంది. ఈ నెల 15 వరకు జీతాలు, పెన్షన్లు కూడా అందక.. అవి ఎప్పుడు వస్తాయో భరోసా లేక సాధారణ ఉద్యోగులు అల్లాడిపోయారు. మరోవైపు చిన్న చిన్న బిల్లుల సొమ్ములు రాక అనేక మంది విలవిల్లాడుతున్నారు. గుత్తేదారులు, సరఫరాదారుల సంగతి సరేసరి. ఈ నెలలో అప్పు పుట్టే పరిస్థితి లేకుండా పోయింది.

ఓవర్‌డ్రాఫ్టు నుంచి బయటపడేందుకు ప్రభుత్వం దొంగ దారిలో రుణం పుట్టించి దాన్ని ఆర్బీఐకు చెల్లించి రోజులు నెట్టుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబరు నెలాఖరుకు రాష్ట్ర రెవెన్యూ లోటు అంచనాలకు మించిపోయిన వైనం కలవర పెడుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏడాది మొత్తానికి రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు మాత్రమే ఉంటుందని బడ్జెట్‌ అంచనాల్లో ప్రభుత్వం పేర్కొంది. నిజానికి ఆ స్థాయి రెవెన్యూ లోటు కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసేదే. అలాంటిది ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబరు నెలాఖరు నాటికి అంచనాలను మించి 270 శాతం దాటిన రెవెన్యూ లోటు.. ఏకంగా రూ.46,071 కోట్లకు చేరింది.

రెవెన్యూ ఖర్చులకే సింహభాగం: సాధారణంగా ఆర్థిక క్రమశిక్షణ సూత్రాల్లో రెవెన్యూ లోటును తగ్గించుకోవడం కీలకం. అంటే రెవెన్యూ రాబడిని మించి.. ఖర్చు చేస్తే అది రెవెన్యూ లోటుగా మారుతుంది. రెవెన్యూ ఖర్చులన్నీ ఆస్తులను, ఆదాయాన్ని సృష్టించేవి కావు. ఒక వైపు అప్పుల విశ్వరూపం కనిపిస్తోంది.. మరోవైపు ఆ అప్పులను రెవెన్యూ ఖర్చులకే సింహభాగం మళ్లించేస్తున్నారు. అప్పు తెచ్చి ఆస్తి సృష్టించకుండా ఖర్చులు చేసేస్తే ఇక రాష్ట్రం పరిస్థితి ఏంటి..? కుటుంబ ఖర్చులను పరిశీలించుకునే ఏ సామాన్యుడికైనా ఈ విషయం ఇట్టే అవగతమవుతుంది.

అప్పులు పెరిగిపోతున్నాయి: ఆస్తులు పెంచుకునే మార్గాలు లేవు.. అప్పులు పెరిగిపోతున్నాయి. రోజువారీ ప్రభుత్వ నిర్వహణ ఖర్చులకు.. జీతాలకు కూడా నిధుల్లేని పరిస్థితులు ఏర్పడితే రాష్ట్రం ఆర్థికంగా ఏ పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 7 నెలల కాలంలో రెవెన్యూ లోటు రూ.46,071 కోట్లు, ద్రవ్యలోటు రూ.53,440 కోట్లుగా లెక్కలు తేల్చారు. ద్రవ్యలోటు అంటే రుణమే. రాష్ట్ర రాబడి ఖర్చులకు సరిపోనప్పుడు.. అంటే సరిపడే ద్రవ్యం లేనప్పుడు అప్పుల రూపంలో తెచ్చి ఖర్చు చేసిన మొత్తమే ద్రవ్యలోటు.

మరో 5 నెలలు ఆర్థిక సంవత్సరం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడాది మొత్తం మీద రూ.48,724 కోట్ల రుణం తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. అలాంటిది తొలి 7 నెలల కాలంలోనే ప్రజారుణం, బహిరంగ మార్కెట్‌ రుణాలు కలిపి ఏకంగా రూ.53,440 కోట్లు తీసుకున్నట్లు సర్కారు అధికారికంగా పేర్కొంది. మరో 5 నెలలు ఆర్థిక సంవత్సరం మిగిలి ఉండగానే ఈ స్థాయిలో అప్పులు తీసుకుంది. నిజానికి ఇవి అధికారిక అప్పులు మాత్రమే. ఇవి కాకుండా కార్పొరేషన్ల రూపంలో మరో రూ.15,000 కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు సమాచారం. ఆ రుణాలనూ ప్రభుత్వ అవసరాలకే మళ్లిస్తున్నారు. ఆ అప్పులు తీర్చాల్సిన పాత్ర కూడా ప్రభుత్వమే పోషిస్తోంది.

ఇవీ చదవండి: రామోజీ ఫిల్మ్‌సిటీలో వినోదాలు పంచుతున్న వింటర్ ఫెస్ట్..

'వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు కష్టకాలమే'.. ఆర్​బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్‌.. ఎంతంటే

Andhra Pradesh Debts : ఆంధ్రప్రదేశ్​లో ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో సాధారణ ప్రజలకు సైతం అనుభవంలోకి వస్తోంది. ఈ నెల 15 వరకు జీతాలు, పెన్షన్లు కూడా అందక.. అవి ఎప్పుడు వస్తాయో భరోసా లేక సాధారణ ఉద్యోగులు అల్లాడిపోయారు. మరోవైపు చిన్న చిన్న బిల్లుల సొమ్ములు రాక అనేక మంది విలవిల్లాడుతున్నారు. గుత్తేదారులు, సరఫరాదారుల సంగతి సరేసరి. ఈ నెలలో అప్పు పుట్టే పరిస్థితి లేకుండా పోయింది.

ఓవర్‌డ్రాఫ్టు నుంచి బయటపడేందుకు ప్రభుత్వం దొంగ దారిలో రుణం పుట్టించి దాన్ని ఆర్బీఐకు చెల్లించి రోజులు నెట్టుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబరు నెలాఖరుకు రాష్ట్ర రెవెన్యూ లోటు అంచనాలకు మించిపోయిన వైనం కలవర పెడుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏడాది మొత్తానికి రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు మాత్రమే ఉంటుందని బడ్జెట్‌ అంచనాల్లో ప్రభుత్వం పేర్కొంది. నిజానికి ఆ స్థాయి రెవెన్యూ లోటు కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసేదే. అలాంటిది ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబరు నెలాఖరు నాటికి అంచనాలను మించి 270 శాతం దాటిన రెవెన్యూ లోటు.. ఏకంగా రూ.46,071 కోట్లకు చేరింది.

రెవెన్యూ ఖర్చులకే సింహభాగం: సాధారణంగా ఆర్థిక క్రమశిక్షణ సూత్రాల్లో రెవెన్యూ లోటును తగ్గించుకోవడం కీలకం. అంటే రెవెన్యూ రాబడిని మించి.. ఖర్చు చేస్తే అది రెవెన్యూ లోటుగా మారుతుంది. రెవెన్యూ ఖర్చులన్నీ ఆస్తులను, ఆదాయాన్ని సృష్టించేవి కావు. ఒక వైపు అప్పుల విశ్వరూపం కనిపిస్తోంది.. మరోవైపు ఆ అప్పులను రెవెన్యూ ఖర్చులకే సింహభాగం మళ్లించేస్తున్నారు. అప్పు తెచ్చి ఆస్తి సృష్టించకుండా ఖర్చులు చేసేస్తే ఇక రాష్ట్రం పరిస్థితి ఏంటి..? కుటుంబ ఖర్చులను పరిశీలించుకునే ఏ సామాన్యుడికైనా ఈ విషయం ఇట్టే అవగతమవుతుంది.

అప్పులు పెరిగిపోతున్నాయి: ఆస్తులు పెంచుకునే మార్గాలు లేవు.. అప్పులు పెరిగిపోతున్నాయి. రోజువారీ ప్రభుత్వ నిర్వహణ ఖర్చులకు.. జీతాలకు కూడా నిధుల్లేని పరిస్థితులు ఏర్పడితే రాష్ట్రం ఆర్థికంగా ఏ పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 7 నెలల కాలంలో రెవెన్యూ లోటు రూ.46,071 కోట్లు, ద్రవ్యలోటు రూ.53,440 కోట్లుగా లెక్కలు తేల్చారు. ద్రవ్యలోటు అంటే రుణమే. రాష్ట్ర రాబడి ఖర్చులకు సరిపోనప్పుడు.. అంటే సరిపడే ద్రవ్యం లేనప్పుడు అప్పుల రూపంలో తెచ్చి ఖర్చు చేసిన మొత్తమే ద్రవ్యలోటు.

మరో 5 నెలలు ఆర్థిక సంవత్సరం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడాది మొత్తం మీద రూ.48,724 కోట్ల రుణం తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. అలాంటిది తొలి 7 నెలల కాలంలోనే ప్రజారుణం, బహిరంగ మార్కెట్‌ రుణాలు కలిపి ఏకంగా రూ.53,440 కోట్లు తీసుకున్నట్లు సర్కారు అధికారికంగా పేర్కొంది. మరో 5 నెలలు ఆర్థిక సంవత్సరం మిగిలి ఉండగానే ఈ స్థాయిలో అప్పులు తీసుకుంది. నిజానికి ఇవి అధికారిక అప్పులు మాత్రమే. ఇవి కాకుండా కార్పొరేషన్ల రూపంలో మరో రూ.15,000 కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు సమాచారం. ఆ రుణాలనూ ప్రభుత్వ అవసరాలకే మళ్లిస్తున్నారు. ఆ అప్పులు తీర్చాల్సిన పాత్ర కూడా ప్రభుత్వమే పోషిస్తోంది.

ఇవీ చదవండి: రామోజీ ఫిల్మ్‌సిటీలో వినోదాలు పంచుతున్న వింటర్ ఫెస్ట్..

'వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు కష్టకాలమే'.. ఆర్​బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.