ETV Bharat / state

Alluri Sitaramaraju Birth Anniversary: 'అల్లూరి స్మారక మందిరాన్ని తెలుగు ప్రజలకు అంకితం చేస్తాం'

author img

By

Published : Jan 2, 2022, 8:27 PM IST

Alluri Sitaramaraju Birth Anniversary: ఏపీలో నిర్మిస్తున్న అల్లూరి స్మారక మందిరాన్ని త్వరలోనే తెలుగు ప్రజలకు అంకితం చేయనున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే అల్లూరి స్వగ్రామాన్ని సందర్శించి స్మారక మందిర పనులను పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకొని ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్​లో క్షత్రియా సేవా సంస్థ ప్రత్యేకంగా వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలకు కిషన్ రెడ్డితోపాటు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్, సినీనటులు మోహన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ హాజరయ్యారు.

Alluri Sitaramaraju Birth Anniversary: 'అల్లూరి స్మారక మందిరాన్ని తెలుగు ప్రజలకు అంకితం చేస్తాం'
Alluri Sitaramaraju Birth Anniversary: 'అల్లూరి స్మారక మందిరాన్ని తెలుగు ప్రజలకు అంకితం చేస్తాం'
Alluri Sitaramaraju Birth Anniversary: 'అల్లూరి స్మారక మందిరాన్ని తెలుగు ప్రజలకు అంకితం చేస్తాం'

Alluri Sitaramaraju Birth Anniversary: ఆంధ్రప్రదేశ్​లో నిర్మిస్తున్న అల్లూరి స్మారక మందిరాన్ని త్వరలోనే తెలుగు ప్రజలకు అంకితం చేయనున్నట్లు కేంద్ర సాంస్కతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే అల్లూరి స్వగ్రామాన్ని సందర్శించి స్మారక మందిర పనులను పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ ఫిల్మ్​నగర్ కల్చరల్ క్లబ్​లో క్షత్రియా సేవా సంస్థ ప్రత్యేకంగా వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలకు కిషన్ రెడ్డితోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్, సినీనటులు మోహన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ హాజరయ్యారు. అల్లూరి 125వ జయంతి ఉత్సవాల పోస్టర్​ను ఆవిష్కరించి స్వాతంత్య్ర పోరాటంలో అల్లూరి వీరత్వాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజుగా నటించిన సూపర్ స్టార్ కృష్ణను అతిథులు ఘనంగా సన్మానించారు. అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేయాలని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. అల్లూరి జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని కిషన్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు. ఏపీలో అల్లూరి స్మారక మందిరాన్ని త్వరలోనే తెలుగు ప్రజలకు అంకితం చేస్తామని, హైదరాబాద్​లోనూ ప్రత్యేకంగా మ్యూజియం నిర్మాణానికి కేంద్రం 18 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే ఆజాదీకా అమృతోత్సవాల్లో భాగంగా ఈ సంక్రాంతి ముగ్గుల్లో ఆడపడుచులు దేశభక్తిని ప్రతిబింబించేలా రంగవల్లులు వేయాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్​లో ప్రత్యేక మ్యూజియం...

ఈ జులై నుంచి అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కాబట్టి సంవత్సరం పాటుగా అనేక కార్యక్రమాలు చేయాలని సేవాసమితిని కోరుతున్నాను. ఆజాదీ కా అమృత్​ మహోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్​లో ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయాలని కేంద్రం 18కోట్ల రూపాయలను మంజూరు చేసింది.

--కిషన్​ రెడ్డి, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి

ఒక ప్రాంతానికే చెందిన వ్యక్తి కాదు..

అల్లూరి సీతారామరాజు ఒక ప్రాంతానికే చెందిన వ్యక్తి కాదు. నిజంగా మా ప్రాంతానికి చెందిన వారైతే ఇప్పటివరకే సీఎం కేసీఆర్​ స్మారకాన్ని కట్టించేవారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఈ విషయంలో కేంద్ర మంత్రి ఏపీకి సహకారం అందిస్తారని నమ్మకం ఉంది.

-శ్రీనివాస్​ గౌడ్​, తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి

నా నంబర్​ వన్​ సినిమా అదే..

నా వందో చిత్రంగా అల్లూరి సీతారామరాజు నేనే నిర్మించాను. అద్భుతమైన రెస్పాన్స్​ వచ్చింది. సంవత్సరం ఆడింది ఆ సినిమా. ఆ తర్వాత 365 సినిమాలు చేసినా నా నంబర్​ వన్​ సినిమా మాత్రం అల్లూరి సీతారామరాజే.

--కృష్ణ, సినీనటులు

ఇదీ చదవండి:

Alluri Sitaramaraju Birth Anniversary: 'అల్లూరి స్మారక మందిరాన్ని తెలుగు ప్రజలకు అంకితం చేస్తాం'

Alluri Sitaramaraju Birth Anniversary: ఆంధ్రప్రదేశ్​లో నిర్మిస్తున్న అల్లూరి స్మారక మందిరాన్ని త్వరలోనే తెలుగు ప్రజలకు అంకితం చేయనున్నట్లు కేంద్ర సాంస్కతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే అల్లూరి స్వగ్రామాన్ని సందర్శించి స్మారక మందిర పనులను పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ ఫిల్మ్​నగర్ కల్చరల్ క్లబ్​లో క్షత్రియా సేవా సంస్థ ప్రత్యేకంగా వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలకు కిషన్ రెడ్డితోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్, సినీనటులు మోహన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ హాజరయ్యారు. అల్లూరి 125వ జయంతి ఉత్సవాల పోస్టర్​ను ఆవిష్కరించి స్వాతంత్య్ర పోరాటంలో అల్లూరి వీరత్వాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజుగా నటించిన సూపర్ స్టార్ కృష్ణను అతిథులు ఘనంగా సన్మానించారు. అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేయాలని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. అల్లూరి జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని కిషన్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు. ఏపీలో అల్లూరి స్మారక మందిరాన్ని త్వరలోనే తెలుగు ప్రజలకు అంకితం చేస్తామని, హైదరాబాద్​లోనూ ప్రత్యేకంగా మ్యూజియం నిర్మాణానికి కేంద్రం 18 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే ఆజాదీకా అమృతోత్సవాల్లో భాగంగా ఈ సంక్రాంతి ముగ్గుల్లో ఆడపడుచులు దేశభక్తిని ప్రతిబింబించేలా రంగవల్లులు వేయాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్​లో ప్రత్యేక మ్యూజియం...

ఈ జులై నుంచి అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కాబట్టి సంవత్సరం పాటుగా అనేక కార్యక్రమాలు చేయాలని సేవాసమితిని కోరుతున్నాను. ఆజాదీ కా అమృత్​ మహోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్​లో ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయాలని కేంద్రం 18కోట్ల రూపాయలను మంజూరు చేసింది.

--కిషన్​ రెడ్డి, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి

ఒక ప్రాంతానికే చెందిన వ్యక్తి కాదు..

అల్లూరి సీతారామరాజు ఒక ప్రాంతానికే చెందిన వ్యక్తి కాదు. నిజంగా మా ప్రాంతానికి చెందిన వారైతే ఇప్పటివరకే సీఎం కేసీఆర్​ స్మారకాన్ని కట్టించేవారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఈ విషయంలో కేంద్ర మంత్రి ఏపీకి సహకారం అందిస్తారని నమ్మకం ఉంది.

-శ్రీనివాస్​ గౌడ్​, తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి

నా నంబర్​ వన్​ సినిమా అదే..

నా వందో చిత్రంగా అల్లూరి సీతారామరాజు నేనే నిర్మించాను. అద్భుతమైన రెస్పాన్స్​ వచ్చింది. సంవత్సరం ఆడింది ఆ సినిమా. ఆ తర్వాత 365 సినిమాలు చేసినా నా నంబర్​ వన్​ సినిమా మాత్రం అల్లూరి సీతారామరాజే.

--కృష్ణ, సినీనటులు

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.