ETV Bharat / state

'ఎస్సీ, ఎస్టీలు, గిరిజనులపై దాడులు వెంటనే ఆపేయాలి'

హైదరాబాద్​ ట్యాంక్​బండ్​పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం ముందు అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్య ధర్నా నిర్వహించింది. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు కావస్తున్నా... ప్రతియేటా హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నాయని సమాఖ్య నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీలు, గిరిజనులపై దాడులు, వేధింపులు ఆపకపోతే... పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

author img

By

Published : Jun 18, 2020, 2:50 PM IST

akhila bharata sc, st samakya protest in hyderabad
'ఎస్సీ, ఎస్టీలు, గిరిజనులపై దాడులు వెంటనే ఆపేయాలి'

ఎస్సీ, ఎస్టీ, గిరిజనులపై దాడులను నిరసిస్తూ... అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్య ఆందోళనకు దిగింది. సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... హైదరాబాద్​ ట్యాంక్​బండ్​పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించింది. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు కావస్తున్నా... ప్రతియేటా హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నాయని సమాఖ్య నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇందుకు ఉదాహరణ భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన కాల్వ దేవదాస్ అనే రైతు ఐదెకరాల వ్యవసాయ భూమిని... స్థానిక తెరాస నేత పొన్నాల నాగరాజు కొందరు అసాంఘిక శక్తులతో కలసి కబ్జా చేశారని ఆరోపించారు. పాక్షికంగా ఇంటిని, పంటను ధ్వంసం చేసి భయానక వాతావరణం సృష్టించారని... దీనికి పోలీసులు కూడా వత్తాసు పలకడమే కాకుండా... దేవదాసుపైన అక్రమ కేసులు బనాయించారని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు కాల్వ దేవదాస్ భూమిని కాపాడి... దాడులకు పాల్పడ్డ భూకబ్జాదారులపై , పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీలు, గిరిజనులపై దాడులు, వేధింపులు ఆపకపోతే... పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ సందేహానికి ప్రధాని స్పష్టత

ఎస్సీ, ఎస్టీ, గిరిజనులపై దాడులను నిరసిస్తూ... అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్య ఆందోళనకు దిగింది. సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... హైదరాబాద్​ ట్యాంక్​బండ్​పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించింది. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు కావస్తున్నా... ప్రతియేటా హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నాయని సమాఖ్య నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇందుకు ఉదాహరణ భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన కాల్వ దేవదాస్ అనే రైతు ఐదెకరాల వ్యవసాయ భూమిని... స్థానిక తెరాస నేత పొన్నాల నాగరాజు కొందరు అసాంఘిక శక్తులతో కలసి కబ్జా చేశారని ఆరోపించారు. పాక్షికంగా ఇంటిని, పంటను ధ్వంసం చేసి భయానక వాతావరణం సృష్టించారని... దీనికి పోలీసులు కూడా వత్తాసు పలకడమే కాకుండా... దేవదాసుపైన అక్రమ కేసులు బనాయించారని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు కాల్వ దేవదాస్ భూమిని కాపాడి... దాడులకు పాల్పడ్డ భూకబ్జాదారులపై , పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీలు, గిరిజనులపై దాడులు, వేధింపులు ఆపకపోతే... పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ సందేహానికి ప్రధాని స్పష్టత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.