ETV Bharat / state

వింత చేప... ఓడరేవు తీరానికి కొట్టుకు వచ్చింది!

author img

By

Published : Feb 19, 2021, 8:23 AM IST

ఏపీలోని ప్రకాశం జిల్లా ఓడరేవు సముద్రతీరానికి ఓ వింత చేప కొట్టుకు వచ్చింది. దానికి మూడు కళ్లు ఉన్నాయనీ.. నీళ్లల్లో వేస్తే రబ్బర్​లా సాగుతోందని మత్స్యకారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

strange
వింత చేప... ఓడరేవు తీరానికి కొట్టుకు వచ్చింది!

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా చీరాల మండలం ఓడరేవు సముద్ర తీరానికి వింత చేప కొట్టుకొచ్చింది. ఓడరేవు మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్తుండగా.. సముద్ర అలల్లో తీరానికి కొట్టు కొచ్చిన వింత చేప కంటపడింది. పరిశీలించగా ఆ వింత చేపకు మూడు కళ్లు ఉన్నాయని.. ఆకారం విచిత్రంగా ఉందని.. నీళ్లల్లో వేస్తే రబ్బరులాగా సాగుతోందని వివరించారు.

సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు వివిధ రకాల చేపలు చూస్తుంటామని.. ఈ రకం వింత చేపను చూడటం ఇదే మొదటిసారని ఓడరేవు మత్స్యకారులు తెలిపారు. ఈ చేప క్వారల్స్ రకానికి చెందిన వింత జీవి అని మత్స్య శాఖ విశ్రాంత జేడీ బలరామ్​ తెలిపారు.

వింత చేప... ఓడరేవు తీరానికి కొట్టుకు వచ్చింది!

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా చీరాల మండలం ఓడరేవు సముద్ర తీరానికి వింత చేప కొట్టుకొచ్చింది. ఓడరేవు మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్తుండగా.. సముద్ర అలల్లో తీరానికి కొట్టు కొచ్చిన వింత చేప కంటపడింది. పరిశీలించగా ఆ వింత చేపకు మూడు కళ్లు ఉన్నాయని.. ఆకారం విచిత్రంగా ఉందని.. నీళ్లల్లో వేస్తే రబ్బరులాగా సాగుతోందని వివరించారు.

సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు వివిధ రకాల చేపలు చూస్తుంటామని.. ఈ రకం వింత చేపను చూడటం ఇదే మొదటిసారని ఓడరేవు మత్స్యకారులు తెలిపారు. ఈ చేప క్వారల్స్ రకానికి చెందిన వింత జీవి అని మత్స్య శాఖ విశ్రాంత జేడీ బలరామ్​ తెలిపారు.

వింత చేప... ఓడరేవు తీరానికి కొట్టుకు వచ్చింది!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.