ఏపీలోని విజయవాడకు చెందిన దూపగుంట్ల లక్ష్మణరావు కొవిడ్ బారిన పడటంతో మూడు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఆయాసం ఎక్కువైంది. సోమవారం నగరంలోని కొవిడ్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఓపీ రాయించి మూడు గంటలు వేచి చూశారు... పడక ఖాళీ అయింది.. ఈ క్రమంలో రోగిని లోపలికి తీసుకురమ్మని కబురు వచ్చింది.
బోరుమన్న కుటుంబీకులు..
లోనికి తీసుకెళ్లేలోపే ద్వారం వద్ద లక్ష్మణరావు ప్రాణం పోయింది. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ ఆసుపత్రి బయటే మరో మూడు గంటలు మృతదేహం వద్ద కూర్చుండిపోయారు. మృతదేహానికి పంచనామా చేయాల్సినవారు ఎవరూ రాలేదు. దీంతో ఆటోలో ఇంటికి తీసుకెళ్లిపోయారు.
ఇదీ చూడండి: అంబులెన్సులు నిలిపివేయడం మానవత్వమేనా?: హైకోర్టు