ETV Bharat / state

గాంధీలో పేరుకుపోయిన 300 మృతదేహాలు..!

author img

By

Published : Apr 30, 2021, 4:16 AM IST

కరోనా కాలంలో చికిత్సే కాదు అంత్యక్రియల ప్రక్రియ కూడా ఖరీదైనదిగా.. అత్యంత సంక్లిష్టంగా మారిపోవడం విషాదకరం. రోగమొస్తే ఆసుపత్రిలో పడక దొరకదు.. దొరికితే ఆక్సిజన్‌ అందదు.. చివరకు కన్నుమూస్తే గౌరవప్రదంగా అంత్యక్రియలు పూర్తిచేసే అవకాశం కూడా దక్కదు! కొవిడ్‌ పాజిటివ్‌ రిపోర్టు ఉంటే కానీ ఆసుపత్రిలో చేరనివ్వరు.. పోలీస్‌స్టేషన్‌ నుంచి నిరభ్యంతర పత్రం ఉంటేకానీ ఆసుపత్రి నుంచి శవాన్ని అప్పగించరు.. కాసులు చేతిలో పెడితే కానీ అంబులెన్సు కదలదు.. శ్మశానవాటికలో తగినంత ‘చమురు’ పోస్తే కాని కట్టె కాలదు! ఇదీ నేటి దుస్థితి!!

గాంధీలో పేరుకుపోయిన మృతదేహాలు
గాంధీలో పేరుకుపోయిన మృతదేహాలు

గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా’ మృతదేహాలు పేరుకుపోతున్నాయి. సకాలంలో అంత్యక్రియలు పూర్తి కావడం లేదు. అశాస్త్రీయ విధానాలు, అధికారుల నిర్లక్ష్యం, బంధువుల భయాందోళనల కారణంగా మృతుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. రోజుల తరబడి పేరుకుపోవడంతో తీవ్ర దుర్గంధం వస్తోందని మార్చురీ సిబ్బంది ఆవేదన చెందున్నారు. ‘‘కొవిడ్‌, ఇతర దీర్ఘకాల రుగ్మతల కారణంగా రోజూ ఈ ఆసుపత్రిలో 40-50 మంది వరకు ప్రాణాలు వీడుస్తున్నారు. వాటిలో సగం మాత్రమే అదేరోజు బయటకు వెళ్తున్నాయి. మిగిలిన వాటిని మార్చురీలో ఉంచుతున్నాం. ప్రస్తుతం 300 మృతదేహాలున్నాయి. తీవ్ర దుర్వాసన వస్తోంది. గుండె రాయి చేసుకుని కాపలా కాస్తున్నాం. తక్షణం ఈ సమస్యను పరిష్కరించాలంటూ’ సిబ్బంది వాపోతున్నారు. కొందరు అధికారులు, అంబులెన్సులు, శ్మశానాల్లోని వ్యక్తులు కుమ్మక్కై అంత్యక్రియలకు రూ. 25 వేలకు పైనే వసూలు చేస్తూ మృతుల కుటుంబీకులను కుంగదీస్తున్నారు. దీంతో చాలామంది శవాలను తీసుకువెళ్లకుండా వదిలేస్తున్నారు.
ఆరోపణలు.. పరిష్కారాలు
* శవాన్ని బంధువులకు అప్పగించే ప్రక్రియను సులభతరం చేయాలి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీలో అధికారులను పెంచాలి. డెత్‌ సమ్మరీని వేగంగా ఇవ్వాలి. ప్రభుత్వ అంబులెన్సుల్లో మృతదేహాలను ఉచితంగా శ్మశానవాటికకు పంపే ఏర్పాట్లు చేయాలి.
* నగరంలో 800కు పైగా శ్మశానాలుంటే నాలుగింటికే కొవిడ్‌ శవాలను పంపిస్తున్నారు. అంత్యక్రియల్లో జాప్యానికీ ఇదీ ఓ కారణం. డబ్బులు కోసం ఆశపడి కొందరు అధికారులు ప్రైవేటు అంబులెన్సులతో కుమ్మక్కై, శ్మశానాల్లో ప్రైవేటు వ్యక్తుల ద్వారా అంత్యక్రియలు జరిపిస్తున్నారన్న విమర్శలున్నాయి. కనీసం సర్కిల్‌కు రెండు చొప్పున శ్మశానవాటికలను అందుబాటులోకి తేవాలి. హెల్త్‌ అసిస్టెంట్లను, ఇతరులను అక్కడ బాధ్యులుగా నియమించాలి.
* అంత్యక్రియల నిర్వహణకు రూ.25 వేలు చాలా ఎక్కువని, కట్టెలు, డీజిల్‌, అంబులెన్సు రవాణాతో కలిపినా అంత ఖర్చుకాదని బాధితులు అంటున్నారు. హైదరాబాద్‌ లాంటి నగరంలో ప్రామాణిక ధరను నిర్ణయించకపోవడంతో ఇష్టానుసారం వసూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి.

కారణాలు ఎన్నో...

* ఈ ఆసుపత్రిలో మృతి చెందిన వారి చిత్రాలను బంధువులకు ఫోన్‌లో చూపించి, పోలీస్‌స్టేషన్‌ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకొచ్చి తీసుకెళ్లాలని చెబుతారు. అంతవరకు మార్చురీలో భద్రపరుస్తున్నారు. పోలీసుస్టేషన్‌, జీహెచ్‌ఎంసీ అధికారుల చుట్టూ తిరిగి శవాన్ని తీసుకెళ్లేందుకు ఒకటి, రెండ్రోజుల సమయం పడుతోంది. ఇవన్నీ తిరగలేని కొందరు గుడ్ల నీరు కుక్కుకొని మౌనం దాల్చుతున్నారు.
* కొవిడ్‌ మృతదేహాలకు నగరంలోని శ్మశాన వాటికలకు తీసుకువెళ్లి దహనం చేసేందుకు రూ.25 వేలకు ఖర్చవుతోంది. జిల్లాలకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలంటే రూ.50 వేలకు పైగా ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఈ ఖర్చు భరించలేక కొందరు ముఖం చాటేస్తున్నారు. అనాథలు, నిరాదరణకు గురైన వ్యక్తుల శవాలూ గాంధీలోనే ఉండిపోతున్నాయి.

ఇదీ చూడండి: ఐసోలేషన్​లో రెండు రోజుల్లో ఏడుగురు మృతి

గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా’ మృతదేహాలు పేరుకుపోతున్నాయి. సకాలంలో అంత్యక్రియలు పూర్తి కావడం లేదు. అశాస్త్రీయ విధానాలు, అధికారుల నిర్లక్ష్యం, బంధువుల భయాందోళనల కారణంగా మృతుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. రోజుల తరబడి పేరుకుపోవడంతో తీవ్ర దుర్గంధం వస్తోందని మార్చురీ సిబ్బంది ఆవేదన చెందున్నారు. ‘‘కొవిడ్‌, ఇతర దీర్ఘకాల రుగ్మతల కారణంగా రోజూ ఈ ఆసుపత్రిలో 40-50 మంది వరకు ప్రాణాలు వీడుస్తున్నారు. వాటిలో సగం మాత్రమే అదేరోజు బయటకు వెళ్తున్నాయి. మిగిలిన వాటిని మార్చురీలో ఉంచుతున్నాం. ప్రస్తుతం 300 మృతదేహాలున్నాయి. తీవ్ర దుర్వాసన వస్తోంది. గుండె రాయి చేసుకుని కాపలా కాస్తున్నాం. తక్షణం ఈ సమస్యను పరిష్కరించాలంటూ’ సిబ్బంది వాపోతున్నారు. కొందరు అధికారులు, అంబులెన్సులు, శ్మశానాల్లోని వ్యక్తులు కుమ్మక్కై అంత్యక్రియలకు రూ. 25 వేలకు పైనే వసూలు చేస్తూ మృతుల కుటుంబీకులను కుంగదీస్తున్నారు. దీంతో చాలామంది శవాలను తీసుకువెళ్లకుండా వదిలేస్తున్నారు.
ఆరోపణలు.. పరిష్కారాలు
* శవాన్ని బంధువులకు అప్పగించే ప్రక్రియను సులభతరం చేయాలి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీలో అధికారులను పెంచాలి. డెత్‌ సమ్మరీని వేగంగా ఇవ్వాలి. ప్రభుత్వ అంబులెన్సుల్లో మృతదేహాలను ఉచితంగా శ్మశానవాటికకు పంపే ఏర్పాట్లు చేయాలి.
* నగరంలో 800కు పైగా శ్మశానాలుంటే నాలుగింటికే కొవిడ్‌ శవాలను పంపిస్తున్నారు. అంత్యక్రియల్లో జాప్యానికీ ఇదీ ఓ కారణం. డబ్బులు కోసం ఆశపడి కొందరు అధికారులు ప్రైవేటు అంబులెన్సులతో కుమ్మక్కై, శ్మశానాల్లో ప్రైవేటు వ్యక్తుల ద్వారా అంత్యక్రియలు జరిపిస్తున్నారన్న విమర్శలున్నాయి. కనీసం సర్కిల్‌కు రెండు చొప్పున శ్మశానవాటికలను అందుబాటులోకి తేవాలి. హెల్త్‌ అసిస్టెంట్లను, ఇతరులను అక్కడ బాధ్యులుగా నియమించాలి.
* అంత్యక్రియల నిర్వహణకు రూ.25 వేలు చాలా ఎక్కువని, కట్టెలు, డీజిల్‌, అంబులెన్సు రవాణాతో కలిపినా అంత ఖర్చుకాదని బాధితులు అంటున్నారు. హైదరాబాద్‌ లాంటి నగరంలో ప్రామాణిక ధరను నిర్ణయించకపోవడంతో ఇష్టానుసారం వసూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి.

కారణాలు ఎన్నో...

* ఈ ఆసుపత్రిలో మృతి చెందిన వారి చిత్రాలను బంధువులకు ఫోన్‌లో చూపించి, పోలీస్‌స్టేషన్‌ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకొచ్చి తీసుకెళ్లాలని చెబుతారు. అంతవరకు మార్చురీలో భద్రపరుస్తున్నారు. పోలీసుస్టేషన్‌, జీహెచ్‌ఎంసీ అధికారుల చుట్టూ తిరిగి శవాన్ని తీసుకెళ్లేందుకు ఒకటి, రెండ్రోజుల సమయం పడుతోంది. ఇవన్నీ తిరగలేని కొందరు గుడ్ల నీరు కుక్కుకొని మౌనం దాల్చుతున్నారు.
* కొవిడ్‌ మృతదేహాలకు నగరంలోని శ్మశాన వాటికలకు తీసుకువెళ్లి దహనం చేసేందుకు రూ.25 వేలకు ఖర్చవుతోంది. జిల్లాలకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలంటే రూ.50 వేలకు పైగా ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఈ ఖర్చు భరించలేక కొందరు ముఖం చాటేస్తున్నారు. అనాథలు, నిరాదరణకు గురైన వ్యక్తుల శవాలూ గాంధీలోనే ఉండిపోతున్నాయి.

ఇదీ చూడండి: ఐసోలేషన్​లో రెండు రోజుల్లో ఏడుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.