ETV Bharat / state

మాస్కుల పేరుతో 30 లక్షలు కొట్టేశారు.. ముఖం చాటేశారు

సైబర్​ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మారుతున్న కాలంతోపాటు సైబర్​ నేరగాళ్లు మారుతున్నారు. మాస్కుల కోసం ఓ వ్యాపారవేత్త ఆర్డర్​ చేయగా ముందే డబ్బు చెల్లించాలన్నారు. 30 లక్షల రూపాయలు చెల్లించాక ముఖం చాటేశారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

author img

By

Published : Jun 28, 2020, 8:40 AM IST

30 lakhs cheating cyber crime at hyderabad
30 లక్షలు కొట్టేశారు.. ముఖం చాటేశారు

మాస్కుల కోసం ఆర్డర్ చేసిన ఓ వ్యాపారవేత్త రూ.30 లక్షలు మోసపోయాడు. హైదరాబాద్ అబిడ్స్​కి చెందిన అశోక్ అగర్వాల్ యూరప్​కు చెందిన ఆగ్రో బయో కంపెనీకి మెయిల్ ద్వారా ఆర్డర్ చేశాడు. తనకు రూ.60 లక్షల విలువైన మాస్కులు కావాలని కోరాడు.

కంపెనీ వారు చెప్పిన విధంగా ముందుగా 30 లక్షల రూపాయలు అడ్వాన్స్​గా ఆన్​లైన్ ద్వారా పే చేశాడు. తర్వాత మాస్కులు రాకపోవడం, కంపెనీ వారు స్పందించకపోవడం వల్ల మోసపోయానని తెలుసుకున్నాడు. బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మాస్కుల కోసం ఆర్డర్ చేసిన ఓ వ్యాపారవేత్త రూ.30 లక్షలు మోసపోయాడు. హైదరాబాద్ అబిడ్స్​కి చెందిన అశోక్ అగర్వాల్ యూరప్​కు చెందిన ఆగ్రో బయో కంపెనీకి మెయిల్ ద్వారా ఆర్డర్ చేశాడు. తనకు రూ.60 లక్షల విలువైన మాస్కులు కావాలని కోరాడు.

కంపెనీ వారు చెప్పిన విధంగా ముందుగా 30 లక్షల రూపాయలు అడ్వాన్స్​గా ఆన్​లైన్ ద్వారా పే చేశాడు. తర్వాత మాస్కులు రాకపోవడం, కంపెనీ వారు స్పందించకపోవడం వల్ల మోసపోయానని తెలుసుకున్నాడు. బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : అతడి కోసం మావో అగ్రనేతల కసరత్తు.. ఇంతకీ ఎవరి కోసం..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.