ETV Bharat / state

గాంధీ నుంచి 15 మంది కరోనా బాధితులు డిశ్ఛార్జి

author img

By

Published : Apr 5, 2020, 6:52 AM IST

కరోనా వ్యాధి సోకిన వారికి హైదరాబాద్​ గాంధీ ఆస్పత్రిలో అందించిన ట్రిట్​మెంట్​ ఫలిస్తోంది. నిన్న ఒక్కరోజే 15 మంది కొవిడ్​-19 బాధితులను డిశ్ఛార్జి చేశారు. మరో 83 మంది కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమం ఉన్నట్లు సమాచారం.

15 corona victims discharged from Gandhi hospital in hyderabad
గాంధీ నుంచి 15 మంది కరోనా బాధితులు డిశ్ఛార్జి

కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న 15 మంది బాధితులను శనివారం గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేసి, ఇళ్లకు పంపారు. వ్యాధి నిర్ధరణ అయినప్పటి నుంచి వారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం మెరుగుపడటం వల్ల ఇంటికి పంపిస్తున్నట్లు వైద్యులు ప్రకటించగానే వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఆనందంగా ఇంటి బాట పట్టారు. వైద్యులు తమలో ఆత్మస్థైర్యాన్ని నింపి, మెరుగైన సేవలు అందించడంతో త్వరగా కోలుకున్నామని తెలిపారు. 24 గంటల వ్యవధిలో రెండుసార్లు చేసిన పరీక్షల్లో ఈ 15 మందికి నెగిటివ్‌ రావడం వల్ల డిశ్ఛార్జి చేశారు. మరో 14 రోజులు ఎవరినీ కలవకుండా ఇంట్లోనే ఉండాలని వారికి సూచించినట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. వీరితో కలిపి ఇప్పటివరకు 19 మందిని గాంధీ నుంచి డిశ్ఛార్జి చేశామన్నారు.

ఒకరి పరిస్థితి కొంత విషమం

ఈ ఆసుపత్రిలో మరో 83 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతుండగా, వారిలో ఒకరి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుల్లో ఒక్క వరంగల్‌ వారే 25 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఇంకా 464 మందిని ఐసోలేషన్‌లో ఉంచామని చెప్పారు. వీరి నమూనాలను పరీక్షలకు పంపామని, నివేదికల కోసం ఎదురు చూస్తున్నట్లు డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

ఛాతీ ఆసుపత్రికి ఏడుగురు అనుమానితులు

ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో శనివారం ఏడుగురు కరోనా అనుమానితులు పరీక్షల కోసం చేరారు. ప్రస్తుతం మొత్తం 50 మంది ఛాతీ ఆసుపత్రిలో ఉన్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌ చెప్పారు. కరోనా అనుమానిత లక్షణాలతో ఉన్నవారు స్వయంగా ఛాతీ ఆసుపత్రికి వచ్చి ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చని, అవసరమైన వారికి చికిత్స అందిస్తామని తెలిపారు.

ఆసుపత్రిలో బాధితుల నిరసన

సరోజినీదేవి నేత్రాలయంలో ఐసోలేషన్‌ వార్డు వద్ద శనివారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కొందరు కరోనా బాధితులు ఆసుపత్రి వద్ద నిరసనకు దిగగా.. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. ఈ నేత్రాలయంలో 150 పడకలతో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులో పలు జిల్లాలకు చెందిన అనుమానితులను ఉంచారు. వారి నమూనాలను పరీక్ష చేయించగా, అయిదుగురికి కరోనా వైరస్‌ సోకినట్లు శుక్రవారం రాత్రి తేలింది. శనివారం మరో 12 మందికి నిర్ధారణ అయ్యింది. ఒత్తిడితో కోపోద్రిక్తులైన కొందరు బాధితులు నిరసనకు దిగి వైద్యులు, సిబ్బందిని దుర్భాషలాడారు. విషయం తెలుసుకుని, ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ ఆర్జీ శివమారుతి, హుమయూన్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సునీల్‌, అదనపు ఇన్‌స్పెక్టర్‌ నారాయణరెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి వచ్చారు. బాధితులను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అమూల్యమైన వైద్య సేవలు

‘గాంధీ ఆసుపత్రిలో నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. అక్కడి వైద్య, ఆరోగ్య సిబ్బంది అందించిన సేవలు అమూల్యం. కరోనా సోకిన నేను వారి సేవలతోనే త్వరగా కోలుకోగలిగాను’..అంటూ కృతజ్ఞత వ్యక్తం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువతి. మార్చి నెలలో ఇటలీ నుంచి స్వస్థలానికి వచ్చిన ఈమెకు కరోనా సోకడం వల్ల 11వ తేదీన గాంధీ ఆసుపత్రిలో చేరారు. జిల్లాలో ఆమెది తొలి పాజిటివ్‌ కేసు. రాష్ట్రంలో రెండోది. అప్పటి నుంచి సుమారు 24 రోజులు చికిత్స అందించాక ఆమె కోలుకోవడం వల్ల శనివారం ఆమెను డిశ్ఛార్జి చేసి స్వస్థలానికి పంపారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో 6,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న 15 మంది బాధితులను శనివారం గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేసి, ఇళ్లకు పంపారు. వ్యాధి నిర్ధరణ అయినప్పటి నుంచి వారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం మెరుగుపడటం వల్ల ఇంటికి పంపిస్తున్నట్లు వైద్యులు ప్రకటించగానే వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఆనందంగా ఇంటి బాట పట్టారు. వైద్యులు తమలో ఆత్మస్థైర్యాన్ని నింపి, మెరుగైన సేవలు అందించడంతో త్వరగా కోలుకున్నామని తెలిపారు. 24 గంటల వ్యవధిలో రెండుసార్లు చేసిన పరీక్షల్లో ఈ 15 మందికి నెగిటివ్‌ రావడం వల్ల డిశ్ఛార్జి చేశారు. మరో 14 రోజులు ఎవరినీ కలవకుండా ఇంట్లోనే ఉండాలని వారికి సూచించినట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. వీరితో కలిపి ఇప్పటివరకు 19 మందిని గాంధీ నుంచి డిశ్ఛార్జి చేశామన్నారు.

ఒకరి పరిస్థితి కొంత విషమం

ఈ ఆసుపత్రిలో మరో 83 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతుండగా, వారిలో ఒకరి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుల్లో ఒక్క వరంగల్‌ వారే 25 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఇంకా 464 మందిని ఐసోలేషన్‌లో ఉంచామని చెప్పారు. వీరి నమూనాలను పరీక్షలకు పంపామని, నివేదికల కోసం ఎదురు చూస్తున్నట్లు డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

ఛాతీ ఆసుపత్రికి ఏడుగురు అనుమానితులు

ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో శనివారం ఏడుగురు కరోనా అనుమానితులు పరీక్షల కోసం చేరారు. ప్రస్తుతం మొత్తం 50 మంది ఛాతీ ఆసుపత్రిలో ఉన్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌ చెప్పారు. కరోనా అనుమానిత లక్షణాలతో ఉన్నవారు స్వయంగా ఛాతీ ఆసుపత్రికి వచ్చి ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చని, అవసరమైన వారికి చికిత్స అందిస్తామని తెలిపారు.

ఆసుపత్రిలో బాధితుల నిరసన

సరోజినీదేవి నేత్రాలయంలో ఐసోలేషన్‌ వార్డు వద్ద శనివారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కొందరు కరోనా బాధితులు ఆసుపత్రి వద్ద నిరసనకు దిగగా.. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. ఈ నేత్రాలయంలో 150 పడకలతో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులో పలు జిల్లాలకు చెందిన అనుమానితులను ఉంచారు. వారి నమూనాలను పరీక్ష చేయించగా, అయిదుగురికి కరోనా వైరస్‌ సోకినట్లు శుక్రవారం రాత్రి తేలింది. శనివారం మరో 12 మందికి నిర్ధారణ అయ్యింది. ఒత్తిడితో కోపోద్రిక్తులైన కొందరు బాధితులు నిరసనకు దిగి వైద్యులు, సిబ్బందిని దుర్భాషలాడారు. విషయం తెలుసుకుని, ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ ఆర్జీ శివమారుతి, హుమయూన్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సునీల్‌, అదనపు ఇన్‌స్పెక్టర్‌ నారాయణరెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి వచ్చారు. బాధితులను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అమూల్యమైన వైద్య సేవలు

‘గాంధీ ఆసుపత్రిలో నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. అక్కడి వైద్య, ఆరోగ్య సిబ్బంది అందించిన సేవలు అమూల్యం. కరోనా సోకిన నేను వారి సేవలతోనే త్వరగా కోలుకోగలిగాను’..అంటూ కృతజ్ఞత వ్యక్తం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువతి. మార్చి నెలలో ఇటలీ నుంచి స్వస్థలానికి వచ్చిన ఈమెకు కరోనా సోకడం వల్ల 11వ తేదీన గాంధీ ఆసుపత్రిలో చేరారు. జిల్లాలో ఆమెది తొలి పాజిటివ్‌ కేసు. రాష్ట్రంలో రెండోది. అప్పటి నుంచి సుమారు 24 రోజులు చికిత్స అందించాక ఆమె కోలుకోవడం వల్ల శనివారం ఆమెను డిశ్ఛార్జి చేసి స్వస్థలానికి పంపారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో 6,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.