ETV Bharat / state

కొనసాగుతున్న విద్యార్థుల రాక.. దిల్లీకి చేరుకున్న మరో 145 మంది విద్యార్థులు

author img

By

Published : Mar 5, 2022, 12:49 PM IST

Telangana Students in Ukraine : ఉక్రెయిన్​ నుంచి భారత్​కు తెలుగు విద్యార్థుల రాక కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 145 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు.. దేశానికి చేరుకున్నారు. ఈ సాయంత్రం వారిని స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Telangana Students in Ukraine
ఉక్రెయిన్​ నుంచి తెలుగు విద్యార్థుల రాక

Telangana Students in Ukraine : ఉక్రెయిన్​ నుంచి దేశానికి మరో 145 మంది తెలుగు విద్యార్థులు క్షేమంగా చేరుకున్నారు. తెలంగాణకు చెందిన వారు 62 మంది, ఆంధ్రప్రదేశ్​ నుంచి 83 మంది విద్యార్థులు నాలుగు విమానాల్లో దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు దేశానికి చేరిన తెలంగాణ విద్యార్థుల సంఖ్య 439కి చేరింది. శుక్రవారం నాటికి 377 మంది రాష్ట్రానికి చెందిన విద్యార్థులు.. స్వస్థలాలకు చేరుకున్నారు.

కాగా ఈ ఉదయం దిల్లీకి చేరుకున్న 145 మంది తెలుగు విద్యార్థులకు.. ఏపీ, తెలంగాణ భవన్​లలో అధికారులు భోజన, వసతి ఏర్పాట్లు చేశారు. ఈ సాయంత్రం వారిని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆపరేషన్‌ గంగలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వేలాది మందిని స్వదేశానికి తీసుకొచ్చింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానాల్లో ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాల నుంచి సురక్షితంగా భారత్‌ చేరుస్తోంది. అనేక మంది తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. యుద్ధ పరిస్థితుల్లో భయాందోళన చెందుతున్న వాళ్లందరినీ దేశానికి రప్పిస్తున్నారు.

ఇదీ చదవండి: Telangana Students in Ukraine : ఇప్పటివరకు రాష్ట్రానికి చేరిన 377 మంది విద్యార్థులు

Telangana Students in Ukraine : ఉక్రెయిన్​ నుంచి దేశానికి మరో 145 మంది తెలుగు విద్యార్థులు క్షేమంగా చేరుకున్నారు. తెలంగాణకు చెందిన వారు 62 మంది, ఆంధ్రప్రదేశ్​ నుంచి 83 మంది విద్యార్థులు నాలుగు విమానాల్లో దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు దేశానికి చేరిన తెలంగాణ విద్యార్థుల సంఖ్య 439కి చేరింది. శుక్రవారం నాటికి 377 మంది రాష్ట్రానికి చెందిన విద్యార్థులు.. స్వస్థలాలకు చేరుకున్నారు.

కాగా ఈ ఉదయం దిల్లీకి చేరుకున్న 145 మంది తెలుగు విద్యార్థులకు.. ఏపీ, తెలంగాణ భవన్​లలో అధికారులు భోజన, వసతి ఏర్పాట్లు చేశారు. ఈ సాయంత్రం వారిని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆపరేషన్‌ గంగలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వేలాది మందిని స్వదేశానికి తీసుకొచ్చింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానాల్లో ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాల నుంచి సురక్షితంగా భారత్‌ చేరుస్తోంది. అనేక మంది తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. యుద్ధ పరిస్థితుల్లో భయాందోళన చెందుతున్న వాళ్లందరినీ దేశానికి రప్పిస్తున్నారు.

ఇదీ చదవండి: Telangana Students in Ukraine : ఇప్పటివరకు రాష్ట్రానికి చేరిన 377 మంది విద్యార్థులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.