ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం గుత్తులవారిపేటకు చెందిన గ్రామపెద్దలు.. పది కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తాము చెప్పిన వర్గానికి ఓటేయలేదంటూ ఆగ్రహంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
బహిష్కరణపై గొల్లపాలెం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పైగా.. తమపైనే కేసులు పెడతామంటూ గొల్లపాలెం ఎస్సై బెదిరించారని వాపోయారు.
ఇదీ చదవండి: రెక్కీ నిర్వహించిన ప్రాంతాల్లో సీన్ రీకన్స్ట్రక్షన్