సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ... పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని రాహుల్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ గాంధీభవన్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్, ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ నిరంజన్ నిరాహార దీక్ష చేపట్టారు. ఉత్తమ్కుమార్ రెడ్డి, వీ హనుమంతరావుతోపాటు పలువురు సీనీయర్ నేతలు సంఘీభావం తెలపనున్నారు. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధినేతగా కొనసాగాలని ఒత్తిడి పెంచేందుకే దీక్ష చేపట్టినట్లు వారు తెలిపారు.
ఇవీ చూడండి: నల్గొండపై కేసీఆర్ది సవతితల్లి ప్రేమ..!: కోమటిరెడ్డి