అప్పుచేసి వ్యాపారం చేయడం సహజమే... కానీ చెల్లించకపోవడం వల్ల రుణదాత, గ్రహీత మధ్య వివాదం తలెత్తుతోందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ అన్నారు. 2016 దివాల చట్టంతో సంస్థలపై చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్లో ఓ హోటల్లో రాష్ట్ర న్యాయ సేవా సంస్థ, లీగల్ డైలాగ్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహించిన కార్పొరేట్ సంస్థల దివాల చట్టం-తీరుతెన్నులపై అవగాహన సదస్సుకు... ఎన్సీఎల్టీ ఛైర్మన్ ముఖోపాధ్యాయతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, కంపెనీ సెక్రటరీలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: బస్సు భద్రంగా ఉండాలంటే తాళం వేయాల్సిందే