ETV Bharat / state

వైన్స్​ షాపులను మూసివేయించిన గిరిజన సంఘాలు

author img

By

Published : Feb 8, 2021, 8:54 PM IST

వైన్స్​ షాపుల దోపిడి వల్ల గిరిజనులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని భద్రాచలంలోని గిరిజన సంఘాల నాయకులు మండిపడ్డారు. దుకాణాల ఎదుట ఆందోళనకు దిగి.. షాపులను మూసివేయించారు.

Tribal communities that closed Liquor stores running contrary to regulations
వైన్స్​ షాపులను మూసివేయించిన గిరిజన సంఘాలు

నిబంధనలకు విరుద్ధంగా నడుపుతోన్న మద్యం దుకాణాల ఎదుట గిరిజన సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది.

దుకాణాలకు అనుమతి లేకపోయినా సిట్టింగులు నిర్వహిస్తున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యజమానులంతా సిండికేట్​గా ఏర్పడి మద్యాన్ని బెల్టు షాపులకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. వైన్స్​ షాపుల దోపిడి వల్ల గిరిజనులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కారణంగానే రెండు షాపులను మూసివేయించినట్లు పేర్కొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా నడుపుతోన్న మద్యం దుకాణాల ఎదుట గిరిజన సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది.

దుకాణాలకు అనుమతి లేకపోయినా సిట్టింగులు నిర్వహిస్తున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యజమానులంతా సిండికేట్​గా ఏర్పడి మద్యాన్ని బెల్టు షాపులకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. వైన్స్​ షాపుల దోపిడి వల్ల గిరిజనులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కారణంగానే రెండు షాపులను మూసివేయించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బార్​లో బీరు​ సీసాతో దాడి.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.