ETV Bharat / state

భద్రాద్రి కొత్తగూడెంలో ముగ్గురు కొరియర్​లు అరెస్ట్​ - maoist couriers arrested in charla mandal kothagudem district

మావోయిస్టులు నాటు బాంబుల తయారీకి వాడే సామాగ్రిని సరఫరా చేస్తున్న ముగ్గురు కొరియర్​లను భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు పట్టుకున్నారు. డిసెంబర్ 2 నుంచి మావోయిస్టు వారోత్సవాలు నిర్వహిస్తున్నారన్న ప్రకటనతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.

Three Maoist couriers arrested in bhadradri kottagudem police
భద్రాద్రి కొత్తగూడెంలో ముగ్గురు కొరియర్​లు అరెస్ట్​
author img

By

Published : Dec 4, 2019, 8:23 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టులకు సహాయపడుతున్న ముగ్గురు కొరియర్​లను పోలీసులు అరెస్ట్​ చేశారు. మావోయిస్ట్​ వారోత్సవాలు నిర్వహిస్తున్నారన్న ప్రకటనతో అప్రమత్తమైన పోలీసులు రహదారుల్లో తనిఖీలు చేస్తున్నారు. చర్ల మండలం పూస గుప్ప వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

వారిలో ఒకరు మావోయిస్టు మిలీషియా సభ్యుడు పొడియం ఎడమయ్య, కొరియర్లు పండ, కృష్ణమూర్తిని అరెస్టు చేశారు. వారి నుంచి 30 జెలిటీన్ స్టిక్స్​, 12 డిటోనేటర్ స్వాధీనం చేసుకుని వారిని రిమండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు వారోత్సవాలను పురస్కరించుకొని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్​ కమాండెంట్​ కైలాస్​ అహలా వత్, చర్ల సీఐ సత్యనారాయణ పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెంలో ముగ్గురు కొరియర్​లు అరెస్ట్​

ఇదీ చూడండి: ఖమ్మంలో 'బంగారు దొంగలు' అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టులకు సహాయపడుతున్న ముగ్గురు కొరియర్​లను పోలీసులు అరెస్ట్​ చేశారు. మావోయిస్ట్​ వారోత్సవాలు నిర్వహిస్తున్నారన్న ప్రకటనతో అప్రమత్తమైన పోలీసులు రహదారుల్లో తనిఖీలు చేస్తున్నారు. చర్ల మండలం పూస గుప్ప వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

వారిలో ఒకరు మావోయిస్టు మిలీషియా సభ్యుడు పొడియం ఎడమయ్య, కొరియర్లు పండ, కృష్ణమూర్తిని అరెస్టు చేశారు. వారి నుంచి 30 జెలిటీన్ స్టిక్స్​, 12 డిటోనేటర్ స్వాధీనం చేసుకుని వారిని రిమండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు వారోత్సవాలను పురస్కరించుకొని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్​ కమాండెంట్​ కైలాస్​ అహలా వత్, చర్ల సీఐ సత్యనారాయణ పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెంలో ముగ్గురు కొరియర్​లు అరెస్ట్​

ఇదీ చూడండి: ఖమ్మంలో 'బంగారు దొంగలు' అరెస్ట్

Intro:మావోయిస్టు


Body:కొరియర్ అరెస్ట్


Conclusion:(విజువల్స్ వాట్సాప్ నుంచి తీసుకోగలరు) భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో మావోయిస్టులకు నాటు బాంబుల తయారీకి వాడే సామాగ్రిని సరఫరా చేసే కొరియర్ లను పోలీసులు పట్టుకున్నారు డిసెంబర్ 2 నుంచి మావోయిస్టు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంతో పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలు వివిధ రహదారులలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో చర్ల మండలంలోని పూస గుప్ప వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు దీంతో వారిలో ఒకరు మావోయిస్టు మిలీషియా సభ్యుడు పొడియం ఎడమయ్య, కొరియర్లు పండ, కృష్ణమూర్తి లను అరెస్టు చేసినట్లు తెలిపారు వారి వద్ద నుంచి 30జెలిటీన్ స్టిక్డ్, 12 డిటోనేటర్ స్వాధీనం చేసుకున్నారు ఈ ముగ్గురిని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు అంతేకాకుండా మావోయిస్టులు వారోత్సవాలను పురస్కరించుకొని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడితే కటిన చర్యలు తీసుకుంటామని అన్నారు విలేకరుల సమావేశంలో ఏఎస్పీ తో పాటు సిఆర్పిఎఫ్ కమాండెంట్ కైలాస్ అహలా వత్ , చర్ల సీఐ సత్యనారాయణ పాల్గొన్నారు. బైట్, రాజేష్ చంద్ర ఏ ఎస్ పి భద్రాచలం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.