భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు ఉత్సవాల్లో రామయ్య వరాహావతారంలో భక్తులకు కనువిందు చేశారు. మేళతాళాలు, కోలాటాలతో తిరువీధుల్లో స్వామివారు ఊరేగారు. సీతాపతి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నాలుగో రోజు దశరథ తనయుడు నరసింహ అవతారంలో దర్శనమివ్వనున్నారు.
ఇవీచూడండి: రేపు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన