కొవిడ్ విజృంభణ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల అధికారులు అప్రమత్తమయ్యారు. ఎంపీపీ శ్రీరామ్ మూర్తి.. గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. వీధుల్లో.. పారిశుద్ధ్య పనులు చేయించి, బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.
ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందిగా ఎంపీపీ సూచించారు. కరోనా కట్టడికి అంతా సహకరించాలని ఆయన కోరారు. మండలంలో ఇప్పటికే సుమారు 350 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఐదుగురు మహమ్మారి ధాటికి బలయ్యారు.
ఇదీ చదవండి: కరోనా హెల్ప్ డెస్క్ను సందర్శించిన బండి సంజయ్