భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు పూర్తైంది. గత నలభై ఆరు రోజుల్లో స్వామివారికి భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి అభరణాలను లెక్కించారు.
రూ. 73 లక్షల 38 వేల 315 నగదు, 60 గ్రాముల బంగారం, ఆరు వందల గ్రాముల వెండి కానుకలు వచ్చాయి. 467 అమెరికా డాలర్లు, మలేషియాకు చెందిన 3 రింగెట్స్తో పాటు పలు దేశాల నగదు కానుకగా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గత నెలలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా.. హుండీ ఆదాయం పెరగవచ్చని అధికారులు భావించారు. ఎప్పటి మాదిరిగానే ఆదాయం వచ్చింది.