ETV Bharat / state

ఇల్లందులో సింగరేణి కారుణ్య నియామక పత్రాల పంపిణీ - bhadradri kothagudem district news

వివిధ కారణాలతో మృతిచెందిన సింగరేణి ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకపత్రాలను ఇల్లందు జనరల్ మేనేజర్ అందజేశారు. రక్షణ చర్యలు పాటిస్తూ.. అప్రమత్తంగా పనిచేయాలని వారికి సూచించారు.

Distribution of compassionate appointment papers, compassionate appointment papers, bhadradri kothagudem district
కారుణ్య నియామక పత్రాలు, ఇల్లందులో కారుణ్య నియామక పత్రాలు, సింగరేణిలో కారుణ్య నియామక పత్రాలు
author img

By

Published : May 10, 2021, 1:54 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి జనరల్ మేనేజర్.. వివిధ కారణాలతో చనిపోయిన ఆరుగురు సింగరేణి ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలను అందజేశారు. ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారు నైపుణ్యతతో పని చేస్తూ, రక్షణ చర్యలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కారుణ్య ప్రక్రియ ద్వారా ఉద్యోగం పొందిన వారు తల్లిదండ్రులను గౌరవిస్తూ వారిని మంచిగా చూసుకోవాలని సూచించారు.

ఇప్పటివరకు మొత్తం 175 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకోగా.. అందులో 124 మందికి నియామక పత్రాలు అందజేశామని జీఎం తెలిపారు. ఈరోజు మరో ఆరుగురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్నామని వెల్లడించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి జనరల్ మేనేజర్.. వివిధ కారణాలతో చనిపోయిన ఆరుగురు సింగరేణి ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలను అందజేశారు. ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారు నైపుణ్యతతో పని చేస్తూ, రక్షణ చర్యలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కారుణ్య ప్రక్రియ ద్వారా ఉద్యోగం పొందిన వారు తల్లిదండ్రులను గౌరవిస్తూ వారిని మంచిగా చూసుకోవాలని సూచించారు.

ఇప్పటివరకు మొత్తం 175 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకోగా.. అందులో 124 మందికి నియామక పత్రాలు అందజేశామని జీఎం తెలిపారు. ఈరోజు మరో ఆరుగురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్నామని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.