భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో పీఓ విపి గౌతమ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వందమంది గిరిజన బీఈడి విద్యార్థిని విద్యార్థులు, ఐటీడీఏ ఉద్యోగులు రక్తదానం చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి ప్రాణాపాయ స్థితిలో భద్రాచలం ఆస్పత్రికి వచ్చే గిరిజన నిరుపేదల కోసం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు పీవో తెలిపారు. యువకులు, విద్యార్థులంతా ముందుకొచ్చి రక్తదానం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని ఆయన అన్నారు.
ప్రతి ఒక్కరూ రక్త దానం పై అవగాహన ఏర్పరచుకొని.. రక్తం ఇచ్చేందుకు ముందుకు రావాలని గౌతమ్ పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: ఆన్లైన్లో హాస్టల్ బుకింగ్... అందులోనూ డిస్కౌంట్...