ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేళ.. ఆదిలాబాద్లో భాజపా జిల్లా కార్యాలయంలో నాయకులు యోగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పార్టీ శ్రేణులతో కలిసి యోగాసనాలు చేసారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయ్యాలన్నారు. కొవిడ్ పరిస్థితుల్లో యోగాతో రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు అని తెలిపారు.
ఇదీ చూడండీ : కరోనాను ఎదుర్కొనేందుకు యోగాసనాలు దోహదం:మోదీ