కరోనా వైరస్ కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో రంజాన్ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ముస్లిం ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి రంజాన్ పర్వదినాన్ని నిర్వహించుకుంటున్నారు. లాక్డౌన్ నిబంధనల దృష్ట్యా ఈద్గాలు, మసీదుల వద్ద సామూహిక ప్రార్థనలు చేయట్లేదు.
పల్లెల్లో పలువురు ఒకచోట చేరి భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేసుకున్నారు. అనంతరం ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకొని ఇళ్లకు వెళ్లిపోయారు.
ఇవీ చూడండి: గొర్రెకుంట బావి ఘటనలో వీడిన మిస్టరీ.. ప్రేమ వ్యవహారమే కారణమా?