ETV Bharat / state

CCI Protest in Adilabad: కేంద్రానికి చేతకాకుంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించండి: జోగురామన్న

author img

By

Published : Feb 10, 2022, 3:52 PM IST

CCI Protest in Adilabad: ఆదిలాబాద్​లో మూతపడిన సిమెంట్​ పరిశ్రమను పునరుద్ధరించాలని డిమాండ్​ చేస్తూ.. నేతలు, స్థానికులు రోడ్డెక్కారు. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం జందాపూర్​ బైపాస్​ వద్ద 44 జాతీయ రహదారిని దిగ్బంధించారు. సిమెంట్​ పరిశ్రమను పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకురాకుంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని ఎమ్మెల్యే జోగురామన్న డిమాండ్​ చేశారు.

CCI Protest in Adilabad
CCI Protest in Adilabad

CCI Protest in Adilabad: మూతపడిన ప్రభుత్వ రంగ సంస్థ సిమెంటు పరిశ్రమను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో ఆదిలాబాద్​లో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈనెల 4న ఆదిలాబాద్​లో బంద్​ నిర్వహించగా.. ఇవాళ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం జందాపూర్​ బైపాస్​ వద్ద 44 జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎమ్మెల్యే జోగు రామన్న, సాధన కమిటీ కన్వీనర్‌ మల్లేశ్​ సహా భారీగా స్థానికులు తరలివచ్చారు. భాజపా మినహా ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జాతీయ రహదారిపైనే ఆట, పాటలతో ఆందోళన చేపట్టారు. ఫలితంగా హైదరాబాద్​- నాగపూర్​ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇరువైపుల కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ నిలిచిపోయింది. గల్లీలో ప్రారంభమైన ఉద్యమం.. దిల్లీవరకు తీసుకెళ్తామని నేతలు స్పష్టం చేశారు. సిమెంట్​ పరిశ్రమను పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకురాకుంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని ఎమ్మెల్యే జోగురామన్న డిమాండ్​ చేశారు. ప్రభుత్వ రంగ సిమెంట్​ పరిశ్రమను కాపాడుకొనేందుకు భాజపా నేతలు, శ్రేణులు కలిసిరావాలని కోరారు.

'2014 ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం వస్తే.. సిమెంట్​ పరిశ్రమను తెరిపిస్తామని భాజపా నేతలు హామీ ఇచ్చారు. 2018లో.. ఎంపీగా గెలిపిస్తే సిమెంట్​ పరిశ్రమను తెరిపిస్తామని సోయం బాపూరావు చెప్పారు. ఆ హామీనే నెరవేర్చాలని కోరుతున్నాం. మీకు చేతకాకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి. ఎన్ని కోట్లైనా సిమెంట్​ పరిశ్రమను కాపాడుకుంటాం.'

- జోగు రామన్న, ఆదిలాబాద్​ ఎమ్మెల్యే

'ఈ ఆందోళన కేంద్ర ప్రభుత్వం, భాజపాకు వ్యతిరేకం కాదు. కేవలం సిమెంట్​ పరిశ్రమను కాపాడుకొనేందుకే. నాడు ఇచ్చిన హామీనే అమలుచేయాలని కోరుతున్నాం. అమలుచేయకుంటే మూల్యం చెల్లించక తప్పదు.

- దర్శనాల మల్లేశ్​, సీసీఐ సాధన కమిటీ కన్వీనర్​

CCI Protest in Adilabad: కేంద్రానికి చేతకాకుంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించండి: జోగురామన్న

ఇదీచూడండి: Bandi sanjay Fire On KCR: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతోంది..

CCI Protest in Adilabad: మూతపడిన ప్రభుత్వ రంగ సంస్థ సిమెంటు పరిశ్రమను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో ఆదిలాబాద్​లో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈనెల 4న ఆదిలాబాద్​లో బంద్​ నిర్వహించగా.. ఇవాళ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం జందాపూర్​ బైపాస్​ వద్ద 44 జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎమ్మెల్యే జోగు రామన్న, సాధన కమిటీ కన్వీనర్‌ మల్లేశ్​ సహా భారీగా స్థానికులు తరలివచ్చారు. భాజపా మినహా ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జాతీయ రహదారిపైనే ఆట, పాటలతో ఆందోళన చేపట్టారు. ఫలితంగా హైదరాబాద్​- నాగపూర్​ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇరువైపుల కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ నిలిచిపోయింది. గల్లీలో ప్రారంభమైన ఉద్యమం.. దిల్లీవరకు తీసుకెళ్తామని నేతలు స్పష్టం చేశారు. సిమెంట్​ పరిశ్రమను పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకురాకుంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని ఎమ్మెల్యే జోగురామన్న డిమాండ్​ చేశారు. ప్రభుత్వ రంగ సిమెంట్​ పరిశ్రమను కాపాడుకొనేందుకు భాజపా నేతలు, శ్రేణులు కలిసిరావాలని కోరారు.

'2014 ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం వస్తే.. సిమెంట్​ పరిశ్రమను తెరిపిస్తామని భాజపా నేతలు హామీ ఇచ్చారు. 2018లో.. ఎంపీగా గెలిపిస్తే సిమెంట్​ పరిశ్రమను తెరిపిస్తామని సోయం బాపూరావు చెప్పారు. ఆ హామీనే నెరవేర్చాలని కోరుతున్నాం. మీకు చేతకాకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి. ఎన్ని కోట్లైనా సిమెంట్​ పరిశ్రమను కాపాడుకుంటాం.'

- జోగు రామన్న, ఆదిలాబాద్​ ఎమ్మెల్యే

'ఈ ఆందోళన కేంద్ర ప్రభుత్వం, భాజపాకు వ్యతిరేకం కాదు. కేవలం సిమెంట్​ పరిశ్రమను కాపాడుకొనేందుకే. నాడు ఇచ్చిన హామీనే అమలుచేయాలని కోరుతున్నాం. అమలుచేయకుంటే మూల్యం చెల్లించక తప్పదు.

- దర్శనాల మల్లేశ్​, సీసీఐ సాధన కమిటీ కన్వీనర్​

CCI Protest in Adilabad: కేంద్రానికి చేతకాకుంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించండి: జోగురామన్న

ఇదీచూడండి: Bandi sanjay Fire On KCR: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతోంది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.