ఆదిలాబాద్ జిల్లా బోథ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో సమ్మర్ సమురాయ్ శిబిరం ఉత్సాహంగా సాగుతోంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాయని మధుప్రియ హాజరయ్యారు. జానపద గేయాలు, ఆడపిల్ల చదువుకు సంబంధించిన పాటలు పాడి అలరించారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని ఆశించారామె. ఈ కార్యక్రమంలో గురుకుల కళాశాల ప్రిన్సిపల్ స్వర్ణలత, ఉపాధ్యాయులు, తుల సుభాశ్ వెల్ఫేర్ సొసైటీ ట్రస్ట్ అధ్యక్షుడు తుల అరుణ్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్