ETV Bharat / state

కారు ద్విచక్ర వాహనం ఢీ... దంపతులు మృతి - రోడ్డు ప్రమాద వార్తలు

రోజూలాగే పొట్టకూటి కోసం ద్విచక్రవాహనం మీద దంపతులిద్దరు బయలుదేరారు. కానీ... ఈ సారి వారిని మృత్యువు వెంటాడింది. ఎదురుగా వస్తున్న కారు రూపంలో వచ్చి ఢీకొని... అక్కడికక్కడే ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాదకర ఘటన ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లిలో చోటుచేసుకుంది.

COUPLE DIED IN CAR AND BIKE ACCIDENT AT INDRAVELLI
COUPLE DIED IN CAR AND BIKE ACCIDENT AT INDRAVELLI
author img

By

Published : Feb 24, 2020, 10:43 AM IST

ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొనగా... దంపతులు మృతి చెందారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన లక్ష్మి, అంజి ఆదిలాబాదులో నివాసం ఉంటున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ వంట పాత్రలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.

రోజూ మాదిరిగానే ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్ వైపు వస్తున్న సమయంలో... ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భార్యాభర్తలిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కారు ద్విచక్ర వాహనం ఢీ... దంపతులు మృతి

ఇదీ చూడండి: 'రష్మికకు ట్వీట్‌ చేసింది కలెక్టర్​ కాదు.. పరిశ్రమలశాఖ ఉద్యోగి'

ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొనగా... దంపతులు మృతి చెందారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన లక్ష్మి, అంజి ఆదిలాబాదులో నివాసం ఉంటున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ వంట పాత్రలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.

రోజూ మాదిరిగానే ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్ వైపు వస్తున్న సమయంలో... ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భార్యాభర్తలిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కారు ద్విచక్ర వాహనం ఢీ... దంపతులు మృతి

ఇదీ చూడండి: 'రష్మికకు ట్వీట్‌ చేసింది కలెక్టర్​ కాదు.. పరిశ్రమలశాఖ ఉద్యోగి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.