ETV Bharat / state

'అధికారులు పట్టాలిచ్చారు కానీ.. భూములు ఇవ్వటం లేదు' - వారంతా నిరుపేద రైతులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది.

వారంతా నిరుపేద రైతులు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది. గత ప్రభుత్వం తరఫున రెవిన్యూ అధికారులు 1992లో పలువురు రైతులకు భూమిని కేటాయించారు. సన్న చిన్న రైతులకు భూమి కేటాయించి పొసెషన్ పట్టాలను ఇచ్చారు. కానీ భూమిని చూపించడం మరిచారు. ఈ సంఘటన ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడ మండలం మల్యాలలో జరిగింది.

adilabad farmers Lands changed in telagana
పట్టాలిచ్చారు కానీ.. భూములు మరిచారు
author img

By

Published : Dec 27, 2019, 12:36 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మల్యాల గ్రామానికి చెందిన 62 మంది గిరిజన దళిత రైతులు ఆవేదన చెందుతున్నారు. 1992లో తమకు భూమిని కేటాయించి అప్పటి తహసీల్దార్.. పట్టాలను అందజేశారని అన్నారు. భూమిలో సామాజిక అడవులు పెంచుకొని బతకాలని, ఇటుక బట్టీలు ఏర్పాటు చేసుకొని జీవించాలని వారికి పొసెషన్​ పట్టాలో పేర్కొన్నారని వివరించారు.

కానీ ఆ భూమిని మాత్రం ఇంతవరకు కేటాయించలేదని రైతులు చెబుతున్నారు. గత 27 ఏళ్లుగా ఇటు తహసీల్దార్ కార్యాలయం, అటు జిల్లా పాలనాధికారి కార్యాలయానికి అనేక సార్లు తిరిగినప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మల్యాల గ్రామంలోని సర్వే నెంబర్ 28, 29లో తమకు భూమి కేటాయిస్తున్నట్లు పట్టాలు ఇచ్చారని, కానీ ఆ భూములను చూపించడం లేదని అంటున్నారు. తక్షణమే తమ భూములను చూపించి ప్రభుత్వం సర్వే జరిపించి తమకు ఇప్పించాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. పట్టాలు ఉన్నాయి కానీ, బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.

పట్టాలిచ్చారు కానీ.. భూములు మరిచారు

ఇదీ చూడండి : ఉత్తమ సిటిజెన్స్‌ అవుదాం..

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మల్యాల గ్రామానికి చెందిన 62 మంది గిరిజన దళిత రైతులు ఆవేదన చెందుతున్నారు. 1992లో తమకు భూమిని కేటాయించి అప్పటి తహసీల్దార్.. పట్టాలను అందజేశారని అన్నారు. భూమిలో సామాజిక అడవులు పెంచుకొని బతకాలని, ఇటుక బట్టీలు ఏర్పాటు చేసుకొని జీవించాలని వారికి పొసెషన్​ పట్టాలో పేర్కొన్నారని వివరించారు.

కానీ ఆ భూమిని మాత్రం ఇంతవరకు కేటాయించలేదని రైతులు చెబుతున్నారు. గత 27 ఏళ్లుగా ఇటు తహసీల్దార్ కార్యాలయం, అటు జిల్లా పాలనాధికారి కార్యాలయానికి అనేక సార్లు తిరిగినప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మల్యాల గ్రామంలోని సర్వే నెంబర్ 28, 29లో తమకు భూమి కేటాయిస్తున్నట్లు పట్టాలు ఇచ్చారని, కానీ ఆ భూములను చూపించడం లేదని అంటున్నారు. తక్షణమే తమ భూములను చూపించి ప్రభుత్వం సర్వే జరిపించి తమకు ఇప్పించాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. పట్టాలు ఉన్నాయి కానీ, బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.

పట్టాలిచ్చారు కానీ.. భూములు మరిచారు

ఇదీ చూడండి : ఉత్తమ సిటిజెన్స్‌ అవుదాం..

Intro:tg_adb_91_27_farmers_patta_problums_avb_ts10031_HD
tg_adb_91a_27_farmers_patta_problums_avb_ts10031_HD


Body:ఏ లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ 9490917560
.....
పట్టాలిచ్చారు భూములు చూపించడం మరిచారు
*20 ఏళ్లుగా దళిత గిరిజన రైతుల ఆవేదన
....
( ):- వారంతా నిరు పేద రైతులు రేక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది గతంలో ప్రభుత్వం తరఫున రెవెన్యూ అధికారులు 1992 అంటే దాదాపు 27 ఏళ్ళ క్రితం భూమిని కేటాయించారు సన్న చిన్న రైతులకు భూమి కేటాయించి పొజిషన్ పట్టాలను ఇచ్చారు కానీ భూమి ని చూపించడం మరిచారు దీంతో రైతులకు ఇప్పటికీ చేతిలో పట్టాలున్న కేటాయించిన భూములు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మల్యాల గ్రామానికి చెందిన 62 మంది గిరిజన దళిత రైతులు. మల్యాల గ్రామంలో నిరుపేద కుటుంబాలకు చెందిన 62 మంది గిరిజన దళిత కుటుంబాలకు రెండు ఎకరాలు ఎకరం చొప్పున 1992 లో భూమిని కేటాయిస్తూ అప్పటి తాసిల్దార్ పట్టాలను అందజేశారు భూమిలో సామాజిక అడవులు పెంచుకొని బతకాలని స్టోన్ క్రషర్లు ఏర్పాటు చేసుకోవచ్చని ఇటుక బట్టీలు ఏర్పాటు చేసుకొని జీవించాలని వారికి పొజిషన్పట్టా లో పేర్కొన్నారు కానీ అట్టి భూమిని మాత్రం ఇంతవరకు కేటాయించకపోవడం విడ్డూరంగా ఉంది. గత 27 ఏళ్లుగా ఇటు తాసిల్దార్ కార్యాలయం అటు జిల్లా పాలనాధికారి కార్యాలయం కు అనేకసార్లు తిరిగినప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మల్యాల గ్రామంలోని సర్వే నెంబర్ 28 29 లో తమకు భూమి కేటాయిస్తున్నట్లు ఇచ్చారని కానీ భూములను చూపించడం లేదని పేర్కొన్నారు తక్షణమే తమ భూములను చూపించి సర్వే జరిపించి తమ భూములకు తమకు ఇప్పించాలని కోరారు భూమి కేటాయిస్తే పంటలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు అధికారులు తక్షణమే గ్రామాన్ని సందర్శించి సర్వే నంబర్లను గుర్తించి తమ భూమిని కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు పట్టాలు ఉన్నాయి కానీ బీమా రావడంలేదని బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు తక్షణమే తమకు పంట రుణాలు పెట్టుబడి సాయం వర్తించేలా చేయాలని కోరారు
బైట్: 1).నాగోరావు మాల్యాల, ఇచ్చోడ మండలం ఆదిలాబాద్
2)గంగారాం మాల్యాల, ఇచ్చోడ ఆదిలాబాద్ జిల్లా
3)గంగయ్య మాల్యాల , ఇచ్చోడ ఆదిలాబాద్ జిల్లా


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.