కుంటాల జలపాతం కనువిందుగా ఉందని పాలనాధికారి సిక్తాపట్నాయక్ అన్నారు. శనివారం ఆమె భర్త జీవంత్రామ్పాల్ (ఐఐఎం అహ్మదాబాద్లో ఆర్థికశాస్త్ర ఆచార్యులు) కుమారుడితో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించారు. పాలనురగల జలధారలను చూసి ఆమె మంత్రముగ్ధులయ్యారు.
చుట్టూ పచ్చటి చెట్లతో ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ జలపాతం అందాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని పాలనాధికారి పేర్కొన్నారు. ఆమె వెంట ఎఫ్బీవో బర్నోబ, తహసీల్దార్ శ్రీదేవి, ఆర్ఐ మీరాబాయి తదితరులున్నారు.