ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ పార్కును జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ సందర్శించారు. విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించేలా వివిధ రకాల బోర్డులు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. జనవరి నాటికి పార్కు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట డీఈఓ రవీందర్ రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.
ఇవీ చూడండి: గద్వాలలో ఉద్రిక్తత... పోలీసులపై రైతుల రాళ్లదాడి