స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్కు అత్యున్నత గౌరవం లభించింది. స్విస్ ప్రభుత్వం అతడి చిత్రంతో కరెన్సీ నాణేలను ముద్రించింది. 55వేల కాయిన్లు రూపొందిస్తుండగా.. వాటిని ప్రీ ఆర్డర్ రూపంలో నేటి నుంచి డిసెంబర్ 19 వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయంపై ఫెదరర్ ఆనందం వ్యక్తం చేశాడు.
" ధన్యవాదాలు స్విట్జర్లాండ్.. నా బొమ్మతో నాణేలను ముద్రించడం చాలా గౌరవంగా, ఘనతగా భావిస్తున్నా."
- రోజర్ ఫెదరర్, టెన్నిస్ క్రీడాకారుడు
చరిత్రలో మొట్టమొదటిసారి..
స్విస్ ప్రభుత్వం ఇప్పటివరకు పలు రంగాల్లో దేశానికి సేవ చేసిన వారికి ఈ విధమైన గౌరవం కల్పించింది. అయితే తొలిసారి బ్రతికి ఉన్న వ్యక్తి ఈ ఘనత సాధించడం విశేషం. ఈ ఏడాది జనవరిలో ఫెదరర్ బొమ్మతో 20 ఫ్రాంక్ వెండి నాణేన్ని బహిర్గతం చేసింది. ఆ కాయిన్పై అతడి సూపర్షాట్ అయిన బ్యాక్ హ్యాండ్తో ఫోజును ముద్రించారు.
ఇప్పటికే ఈ నాణేల కోసం భారీగా పోటీ నెలకొన్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది 50 ఫ్రాంక్ గోల్డ్ కాయిన్నూ వేరే డిజైన్తో తీసుకురానున్నట్లు చెప్పారు. మరో 40 వేల నాణేలను ముద్రించి వచ్చే ఏడాది మే నెలలో అందుబాటులోకి తీసుకురానున్నారు.