ETV Bharat / sports

'ద్రవిడ్, రోహిత్ కాంబోలో భారత్ ప్రపంచకప్​ గెలుస్తుంది'

author img

By

Published : Nov 8, 2021, 1:30 PM IST

టీ20 ప్రపంచకప్(t20 2world cup 2021)​లో తమ ఆఖరి మ్యాచ్​ను నమీబియాతో ఆడనుంది టీమ్ఇండియా. అటు కోచ్​గా రవిశాస్త్రి.. ఇటు టీ20 కెప్టెన్​గా కోహ్లీకి ఇదే చివరి మ్యాచ్. వీరి సారథ్యంలో ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేకపోయింది జట్టు. ఇదే విషయంపై స్పందించాడు గంభీర్(gautam gambhir on virat captaincy).

Gambhir
గంభీర్

టీ20 ప్రపంచకప్​(t20 2world cup 2021)లో టీమ్ఇండియా సెమీస్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. దీంతో భారత జట్టుపై పలు విమర్శలు వస్తున్నాయి. అలాగే 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక.. ఇప్పటివరకు మళ్లీ ఐసీసీ టోర్నీలో విజయం సాధించలేదు భారత్. కెప్టెన్​గా కోహ్లీ, కోచ్​గా రవిశాస్త్రి కాంబినేషన్​లో ఒక్క మెగాటోర్నీ కూడా గెలవలేకపోయింది. ఈ విషయంపై స్పందించిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్(gautam gambhir on virat captaincy).. రోహిత్ కెప్టెన్సీ, రాహుల్ ద్రవిడ్ కోచ్​గా భారత్ కచ్చితంగా వచ్చే ప్రపంచకప్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"కెప్టెన్​గా రోహిత్(gambhir on rohit sharma), కోచ్​గా ద్రవిడ్ ఈ ఫార్మాట్​లో జట్టును మరింత ముందుకు తీసుకువెళతారని అనుకుంటున్నా. అలాగే ప్రపంచకప్​ టైటిల్​ కూడా వీరు సాధిస్తారని నమ్ముతున్నానని" వెల్లడించాడు గంభీర్.

ఈ ప్రపంచకప్​(t20 2world cup 2021)లో భాగంగా సోమవారం (నవంబర్ 8) నమీబియాతో జరిగే మ్యాచ్​ ఇటు కోచ్​గా రవిశాస్త్రికి, టీ20 కెప్టెన్​గా కోహ్లీకి చివరిది. దీంతో ఈ మ్యాచ్​లో ఘన విజయం సాధించి వీరిద్దరికి గొప్ప వీడ్కోలు పలకాలని యాజమాన్యం భావిస్తోంది.

ఇవీ చూడండి: 'టీమ్ఇండియా ఓటమికి టాస్ కారణం కాదు'

టీ20 ప్రపంచకప్​(t20 2world cup 2021)లో టీమ్ఇండియా సెమీస్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. దీంతో భారత జట్టుపై పలు విమర్శలు వస్తున్నాయి. అలాగే 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక.. ఇప్పటివరకు మళ్లీ ఐసీసీ టోర్నీలో విజయం సాధించలేదు భారత్. కెప్టెన్​గా కోహ్లీ, కోచ్​గా రవిశాస్త్రి కాంబినేషన్​లో ఒక్క మెగాటోర్నీ కూడా గెలవలేకపోయింది. ఈ విషయంపై స్పందించిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్(gautam gambhir on virat captaincy).. రోహిత్ కెప్టెన్సీ, రాహుల్ ద్రవిడ్ కోచ్​గా భారత్ కచ్చితంగా వచ్చే ప్రపంచకప్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"కెప్టెన్​గా రోహిత్(gambhir on rohit sharma), కోచ్​గా ద్రవిడ్ ఈ ఫార్మాట్​లో జట్టును మరింత ముందుకు తీసుకువెళతారని అనుకుంటున్నా. అలాగే ప్రపంచకప్​ టైటిల్​ కూడా వీరు సాధిస్తారని నమ్ముతున్నానని" వెల్లడించాడు గంభీర్.

ఈ ప్రపంచకప్​(t20 2world cup 2021)లో భాగంగా సోమవారం (నవంబర్ 8) నమీబియాతో జరిగే మ్యాచ్​ ఇటు కోచ్​గా రవిశాస్త్రికి, టీ20 కెప్టెన్​గా కోహ్లీకి చివరిది. దీంతో ఈ మ్యాచ్​లో ఘన విజయం సాధించి వీరిద్దరికి గొప్ప వీడ్కోలు పలకాలని యాజమాన్యం భావిస్తోంది.

ఇవీ చూడండి: 'టీమ్ఇండియా ఓటమికి టాస్ కారణం కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.