ETV Bharat / sports

Tokyo Olympics: క్రీడా గ్రామంలో ఇద్దరు అథ్లెట్లకు కరోనా

author img

By

Published : Jul 18, 2021, 8:55 AM IST

Updated : Jul 18, 2021, 10:23 AM IST

టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)​ కోసం ఏర్పాటు చేసిన క్రీడా గ్రామంలో ఇద్దరు క్రీడాకారులకు కరోనా సోకింది. వీరితో పాటు ఒలింపిక్స్​లో పాల్గొనేందుకు వచ్చిన మరో క్రీడాకారుడికీ కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం ఆ అథ్లెట్​ హోటల్​లో​ నిర్బంధంలో ఉన్నాడు. అథ్లెట్లకు చేస్తున్న స్క్రీనింగ్​ పరీక్షల్లో శనివారం తొలి కేసు బయటపడగా.. ఆదివారం మరో రెండు కేసులు నమోదైనట్లు ఒలింపిక్​ నిర్వాహక కమిటీ వెల్లడించింది.

Two athletes test positive for Covid-19 in Olympic Village, say officials: AFP News Agency
Tokyo Olympics: క్రీడా గ్రామంలో ఇద్దరు అథ్లెట్లకు కరోనా

మరో ఐదు రోజుల్లో ఒలింపిక్స్‌(Tokyo Olympics) క్రీడా సంబరం మొదలవనున్న వేళ.. కరోనా వైరస్‌ కలకలం రేపింది. ఒలింపిక్స్‌ క్రీడా గ్రామంలో ఆదివారం రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు శనివారం ఓ అథ్లెట్​కు కరోనా సోకగా.. అ​తడు ఉంటున్న హోటల్​లోనే ఐసోలేషన్​లో గడుపుతున్నాడు. అథ్లెట్లకు నిర్వహించిన స్క్రీనింగ్​ పరీక్షల్లో ఇప్పటివరకు ముగ్గురు ఆటగాళ్లకు కరోనా సోకినట్లు ఒలింపిక్​ నిర్వాహక కమిటీ వెల్లడించింది.

ఒలింపిక్స్​లో పాల్గొనేందుకు జులై 1 తేదీ నుంచి 16 మధ్య విదేశాల నుంచి ఇప్పటివరకు దాదాపుగా 15 వేల మంది క్రీడాకారులు, అధికారులు, మీడియా ప్రతినిధులు వచ్చారు. అయితే వారందరికీ నిర్వహించిన కరోనా పరీక్షల్లో కేవలం 15 మందే వైరస్​ బారిన పడినట్లు తెలుస్తోంది.

కరోనా మహమ్మారి కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన ఒలింపిక్స్‌ ఈ నెల 23 నుంచి టోక్యోలో ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 13న ఈ క్రీడా గ్రామాన్ని తెరిచారు. ఇప్పటికే వేలాది మంది అథ్లెట్లు, అధికారులు ఈ గ్రామానికి చేరుకున్నారు. కరోనా దృష్ట్యా కఠిన నిబంధనల నడుమ ఒలింపిక్స్‌ను నిర్వహించనున్నారు. ఈ విశ్వక్రీడలకు దాదాపుగా 11వేల మంది, పారాలింపిక్స్‌కు 4,400 మంది క్రీడాకారులు రానున్నారు. పారాలింపిక్స్‌ ఆగస్టు 24 నుంచి మొదలవుతాయి. క్రీడాగ్రామంలోకి వస్తున్న అథ్లెట్లలో 80% మందికి వ్యాక్సినేషన్‌ జరిగిందని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ తెలిపింది.

ఇదీ చూడండి.. ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కరోనా కలకలం

మరో ఐదు రోజుల్లో ఒలింపిక్స్‌(Tokyo Olympics) క్రీడా సంబరం మొదలవనున్న వేళ.. కరోనా వైరస్‌ కలకలం రేపింది. ఒలింపిక్స్‌ క్రీడా గ్రామంలో ఆదివారం రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు శనివారం ఓ అథ్లెట్​కు కరోనా సోకగా.. అ​తడు ఉంటున్న హోటల్​లోనే ఐసోలేషన్​లో గడుపుతున్నాడు. అథ్లెట్లకు నిర్వహించిన స్క్రీనింగ్​ పరీక్షల్లో ఇప్పటివరకు ముగ్గురు ఆటగాళ్లకు కరోనా సోకినట్లు ఒలింపిక్​ నిర్వాహక కమిటీ వెల్లడించింది.

ఒలింపిక్స్​లో పాల్గొనేందుకు జులై 1 తేదీ నుంచి 16 మధ్య విదేశాల నుంచి ఇప్పటివరకు దాదాపుగా 15 వేల మంది క్రీడాకారులు, అధికారులు, మీడియా ప్రతినిధులు వచ్చారు. అయితే వారందరికీ నిర్వహించిన కరోనా పరీక్షల్లో కేవలం 15 మందే వైరస్​ బారిన పడినట్లు తెలుస్తోంది.

కరోనా మహమ్మారి కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన ఒలింపిక్స్‌ ఈ నెల 23 నుంచి టోక్యోలో ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 13న ఈ క్రీడా గ్రామాన్ని తెరిచారు. ఇప్పటికే వేలాది మంది అథ్లెట్లు, అధికారులు ఈ గ్రామానికి చేరుకున్నారు. కరోనా దృష్ట్యా కఠిన నిబంధనల నడుమ ఒలింపిక్స్‌ను నిర్వహించనున్నారు. ఈ విశ్వక్రీడలకు దాదాపుగా 11వేల మంది, పారాలింపిక్స్‌కు 4,400 మంది క్రీడాకారులు రానున్నారు. పారాలింపిక్స్‌ ఆగస్టు 24 నుంచి మొదలవుతాయి. క్రీడాగ్రామంలోకి వస్తున్న అథ్లెట్లలో 80% మందికి వ్యాక్సినేషన్‌ జరిగిందని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ తెలిపింది.

ఇదీ చూడండి.. ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కరోనా కలకలం

Last Updated : Jul 18, 2021, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.