ETV Bharat / sports

ఒలింపిక్స్: ఈసారి వాటికి దూరం- అతిథులూ తక్కువే!

author img

By

Published : Jul 21, 2021, 2:15 PM IST

కొవిడ్​ నేపథ్యంలో గతేడాదే జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్​ సంవత్సరం పాటు వాయిదా పడ్డాయి. ఈ విశ్వక్రీడల ప్రారంభానికి(Tokyo Olympics Opening Ceremony) మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. కరోనా కారణంగా ఈ కార్యక్రమానికి వచ్చే వీఐపీల సంఖ్య తక్కువగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రతి దేశం నుంచి కేవలం ఆరుగురు ప్రతినిధులను మాత్రమే అనుమతించనున్నారు నిర్వాహకులు. ఒలింపిక్​ గ్రామంతో పాటు అథ్లెట్లలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఒలింపిక్స్​ సజావుగా జరిగేది అనుమానంగానే మారింది.

tokyo olympics
టోక్యో ఒలింపిక్స్

ఒలింపిక్స్​ ప్రారంభోత్సవ కార్యక్రమం అంటే సమస్త క్రీడా లోకాన్ని ఒక్క చోటికి తెచ్చే పండగలాంటిది. పెద్ద ఎత్తున పాల్గొనే క్రీడాకారులతో ఆ ప్రాంతమంతా అంగరంగ వైభవంగా కనిపిస్తుంది. వివిధ దేశాధినేతలు, ఆయా దేశాల జాతీయ పతకాల రెపరెపలు, నృత్య ప్రదర్శనలు.. ఇలా అట్టహాసంగా ప్రారంభమవుతుంది. కానీ, ఈసారి ఒలింపిక్స్​కు ఇవేమీ ఉండవు. కరోనా కారణంగా ఈసారి టోక్యో వేదికగా జరగనున్న విశ్వక్రీడల ప్రారంభ వేడుక చాలా నిరాడంబరంగా జరగనుంది.

ఈ సారి ఇలా..

టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics Opening Ceremony)​ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేవలం 15 దేశాల నాయకులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వెయ్యి మంది లోపు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు సమాచారం.

కొవిడ్ మహమ్మారి నియంత్రణలో భాగంగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారని జపాన్​ చీఫ్​ కేబినేట్​ కార్యదర్శి కట్సునోబు కటో తెలిపారు. మొత్తం 70 మంది కేబినేట్​ స్థాయి నాయకులు జపాన్​ను సందర్శించనున్నారని పేర్కొన్నారు. ఆయనలా చెప్తున్నప్పటికీ ఆ సంఖ్యపై స్పష్టత లేదు. మహమ్మారి కారణంగా చాలా మంది తమ పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. దీంతో ఎంత మంది వీఐపీలు వస్తారనేదానిపై అనిశ్చితి నెలకొంది.

ఇప్పటికే ఒలింపిక్​ గ్రామంతో పాటు క్రీడల్లో పాల్గొనే అథ్లెట్లలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్​ సజావుగా జరిగేది చివరి వరకు అనుమానంగానే మారింది. కొవిడ్​ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు అర్ధంతరంగా తప్పుకుంటున్నారు.

పాల్గొననున్న ప్రథమ మహిళ..

అయితే ఇప్పటికే ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్​ మేక్రాన్​, మంగోలియన్​ ప్రధాని ఓయున్-ఎర్డెనే, అమెరికా ప్రథమ మహిళ జిల్​ బైడెన్​తో పాటు మరికొంత మంది విశ్వక్రీడల ఆరంభ వేడుకకు వస్తామని మాట ఇచ్చారు. జపాన్​లో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వీరు హాజరవుతారా లేదా అనేది స్పష్టత లేదు.

ఇదిలా ఉండగా, ఒలింపిక్స్​ నేపథ్యంలో.. కరోనా కారణంగా దెబ్బతిన్న వివిధ దేశాధినేతలతో వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరుచుకోవాలని జపాన్ ప్రధాని భావిస్తున్నట్లు కటో తెలిపారు.

ఇదీ చదవండి: Olympics: వీళ్లు తక్కువేం కాదు.. అద్భుతాలు చేయగలరు!

భారత్​ నుంచి ఆరుగురే..

శుక్రవారం జరిగే కార్యక్రమానికి భారతదేశం నుంచి కేవలం ఆరుగురు ప్రతినిధులను మాత్రమే అనుమతించనున్నారు. ఈ విషయాన్ని భారత చెఫ్​ డి మిషన్​ ప్రేమ్​ కుమార్ వర్మ వెల్లడించారు. ఇందులో భారత పతాకధారులుగా హాకీ కెప్టెన్​ మన్​ప్రీత్​ సింగ్, బాక్సర్​ మేరీకోమ్​ వ్యవహరించనున్నారు.

"భారత్ నుంచి ఆరుగురు (ప్రతి దేశం నుంచి కూడా అంతే సంఖ్యలో) ప్రతినిధులను మాత్రమే ప్రారంభ కార్యక్రమానికి అనుమతించారు. శనివారం పోటీల్లో పాల్గొనే ప్రతి ఆటగాడు ఈ వేడుకకు దూరంగా ఉండి తమ ఆటలపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం శుక్రవారం అర్ధరాత్రి వరకు జరుగుతుంది. కాబట్టి ఆటగాళ్లు వీలైనంత విశ్రాంతి తీసుకుంటే మంచిది."

-ప్రేమ్​ కుమార్ వర్మ, భారత చెఫ్ డి మిషన్​.

వీరితో పాటు క్వారంటైన్​లో ఉన్న(ఆటగాళ్లైనా, కోచ్​లైనా, సహాయక సిబ్బందైనా) వారికి కూడా ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు నిర్వాహకులు. ప్రారంభ వేడుకల తర్వాతి రోజు షూటర్లు, బాక్సర్లు, ఆర్చర్లు, మహిళల, పురుషుల హాకీ జట్లకు పోటీలు ఉన్నాయి. కాగా, ఇందులో మేరీకోమ్​కు తర్వాతి రోజు పోటీ​ లేదు. న్యూజిలాండ్​తో పురుషుల హాకీ జట్టుకు మ్యాచ్​ ఉంది. ఈ మ్యాచ్​లో మాత్రం మన్​ప్రీత్​ సింగ్ పాల్గొనాల్సిందే. ఇక ఒలింపిక్స్​ కోసం భారత్ నుంచి 228 మందితో కూడిన (127 అథ్లెట్లు, మిగిలిన వారు కోచ్​లు, సహాయక సిబ్బంది) బృందం అక్కడికి చేరుకుంది.

గతంలో ఇలా..

విశ్వక్రీడల చరిత్రలో టోక్యో ఒలింపిక్స్​ 32వది. 2020లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్​ కొవిడ్ మహమ్మారి కారణంగా ఒక ఏడాది వాయిదా పడింది. దీంతో 2021 జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. ప్రపంచంలోని దాదాపు 206 దేశాల నుంచి 11వేల అథ్లెట్లు ఈ మెగా క్రీడల్లో పాల్గొంటున్నారు. భారత్​ నుంచి 127 మంది క్రీడాకారులు ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో పాల్గొంటున్నారు. శుక్రవారం జరిగే కార్యక్రమంతో టోక్యో ఒలింపిక్స్​ అధికారకంగా ప్రారంభం కానున్నాయి. తదుపరి విశ్వక్రీడలు పారిస్ వేదికగా 2024లో జరగనున్నాయి.

2028లో అమెరికా, 2032లో బ్రిస్బేన్​లో ఒలింపిక్స్​ నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి: Olympics: ఆరంభ మ్యాచ్​లో ఆతిథ్య జపాన్​ శుభారంభం

ఒలింపిక్స్​ ప్రారంభోత్సవ కార్యక్రమం అంటే సమస్త క్రీడా లోకాన్ని ఒక్క చోటికి తెచ్చే పండగలాంటిది. పెద్ద ఎత్తున పాల్గొనే క్రీడాకారులతో ఆ ప్రాంతమంతా అంగరంగ వైభవంగా కనిపిస్తుంది. వివిధ దేశాధినేతలు, ఆయా దేశాల జాతీయ పతకాల రెపరెపలు, నృత్య ప్రదర్శనలు.. ఇలా అట్టహాసంగా ప్రారంభమవుతుంది. కానీ, ఈసారి ఒలింపిక్స్​కు ఇవేమీ ఉండవు. కరోనా కారణంగా ఈసారి టోక్యో వేదికగా జరగనున్న విశ్వక్రీడల ప్రారంభ వేడుక చాలా నిరాడంబరంగా జరగనుంది.

ఈ సారి ఇలా..

టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics Opening Ceremony)​ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేవలం 15 దేశాల నాయకులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వెయ్యి మంది లోపు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు సమాచారం.

కొవిడ్ మహమ్మారి నియంత్రణలో భాగంగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారని జపాన్​ చీఫ్​ కేబినేట్​ కార్యదర్శి కట్సునోబు కటో తెలిపారు. మొత్తం 70 మంది కేబినేట్​ స్థాయి నాయకులు జపాన్​ను సందర్శించనున్నారని పేర్కొన్నారు. ఆయనలా చెప్తున్నప్పటికీ ఆ సంఖ్యపై స్పష్టత లేదు. మహమ్మారి కారణంగా చాలా మంది తమ పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. దీంతో ఎంత మంది వీఐపీలు వస్తారనేదానిపై అనిశ్చితి నెలకొంది.

ఇప్పటికే ఒలింపిక్​ గ్రామంతో పాటు క్రీడల్లో పాల్గొనే అథ్లెట్లలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్​ సజావుగా జరిగేది చివరి వరకు అనుమానంగానే మారింది. కొవిడ్​ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు అర్ధంతరంగా తప్పుకుంటున్నారు.

పాల్గొననున్న ప్రథమ మహిళ..

అయితే ఇప్పటికే ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్​ మేక్రాన్​, మంగోలియన్​ ప్రధాని ఓయున్-ఎర్డెనే, అమెరికా ప్రథమ మహిళ జిల్​ బైడెన్​తో పాటు మరికొంత మంది విశ్వక్రీడల ఆరంభ వేడుకకు వస్తామని మాట ఇచ్చారు. జపాన్​లో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వీరు హాజరవుతారా లేదా అనేది స్పష్టత లేదు.

ఇదిలా ఉండగా, ఒలింపిక్స్​ నేపథ్యంలో.. కరోనా కారణంగా దెబ్బతిన్న వివిధ దేశాధినేతలతో వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరుచుకోవాలని జపాన్ ప్రధాని భావిస్తున్నట్లు కటో తెలిపారు.

ఇదీ చదవండి: Olympics: వీళ్లు తక్కువేం కాదు.. అద్భుతాలు చేయగలరు!

భారత్​ నుంచి ఆరుగురే..

శుక్రవారం జరిగే కార్యక్రమానికి భారతదేశం నుంచి కేవలం ఆరుగురు ప్రతినిధులను మాత్రమే అనుమతించనున్నారు. ఈ విషయాన్ని భారత చెఫ్​ డి మిషన్​ ప్రేమ్​ కుమార్ వర్మ వెల్లడించారు. ఇందులో భారత పతాకధారులుగా హాకీ కెప్టెన్​ మన్​ప్రీత్​ సింగ్, బాక్సర్​ మేరీకోమ్​ వ్యవహరించనున్నారు.

"భారత్ నుంచి ఆరుగురు (ప్రతి దేశం నుంచి కూడా అంతే సంఖ్యలో) ప్రతినిధులను మాత్రమే ప్రారంభ కార్యక్రమానికి అనుమతించారు. శనివారం పోటీల్లో పాల్గొనే ప్రతి ఆటగాడు ఈ వేడుకకు దూరంగా ఉండి తమ ఆటలపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం శుక్రవారం అర్ధరాత్రి వరకు జరుగుతుంది. కాబట్టి ఆటగాళ్లు వీలైనంత విశ్రాంతి తీసుకుంటే మంచిది."

-ప్రేమ్​ కుమార్ వర్మ, భారత చెఫ్ డి మిషన్​.

వీరితో పాటు క్వారంటైన్​లో ఉన్న(ఆటగాళ్లైనా, కోచ్​లైనా, సహాయక సిబ్బందైనా) వారికి కూడా ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు నిర్వాహకులు. ప్రారంభ వేడుకల తర్వాతి రోజు షూటర్లు, బాక్సర్లు, ఆర్చర్లు, మహిళల, పురుషుల హాకీ జట్లకు పోటీలు ఉన్నాయి. కాగా, ఇందులో మేరీకోమ్​కు తర్వాతి రోజు పోటీ​ లేదు. న్యూజిలాండ్​తో పురుషుల హాకీ జట్టుకు మ్యాచ్​ ఉంది. ఈ మ్యాచ్​లో మాత్రం మన్​ప్రీత్​ సింగ్ పాల్గొనాల్సిందే. ఇక ఒలింపిక్స్​ కోసం భారత్ నుంచి 228 మందితో కూడిన (127 అథ్లెట్లు, మిగిలిన వారు కోచ్​లు, సహాయక సిబ్బంది) బృందం అక్కడికి చేరుకుంది.

గతంలో ఇలా..

విశ్వక్రీడల చరిత్రలో టోక్యో ఒలింపిక్స్​ 32వది. 2020లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్​ కొవిడ్ మహమ్మారి కారణంగా ఒక ఏడాది వాయిదా పడింది. దీంతో 2021 జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. ప్రపంచంలోని దాదాపు 206 దేశాల నుంచి 11వేల అథ్లెట్లు ఈ మెగా క్రీడల్లో పాల్గొంటున్నారు. భారత్​ నుంచి 127 మంది క్రీడాకారులు ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో పాల్గొంటున్నారు. శుక్రవారం జరిగే కార్యక్రమంతో టోక్యో ఒలింపిక్స్​ అధికారకంగా ప్రారంభం కానున్నాయి. తదుపరి విశ్వక్రీడలు పారిస్ వేదికగా 2024లో జరగనున్నాయి.

2028లో అమెరికా, 2032లో బ్రిస్బేన్​లో ఒలింపిక్స్​ నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి: Olympics: ఆరంభ మ్యాచ్​లో ఆతిథ్య జపాన్​ శుభారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.