ETV Bharat / sports

పారా షూటర్​ ప్రపంచ రికార్డు.. ప్రపంచకప్​లో మరో స్వర్ణం

author img

By

Published : Mar 24, 2021, 11:09 AM IST

పారా షూటర్​ మనీశ్ నర్వాల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 50 మీటర్ల పిస్టోల్ మిక్స్​డ్ విభాగంలో స్వర్ణం చేజిక్కుంచుకోవడం సహా ఈ ఘనత అందుకున్నాడు. షూటింగ్ ప్రపంచకప్​లో ప్రతాప్ సింగ్ తోమర్ కూడా బంగారు పతకం సొంతం చేసుకున్నాడు.

Shooter Narwal wins second gold for India, sets world record
మనీష్ నర్వాల్

యూఏఈలో జరుగుతున్న షూటింగ్ పారా ప్రపంచకప్​లో భారత షూటర్​ మనీశ్ నర్వాల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీనితో పాటే 50 మీటర్ల పిస్టోల్​ మిక్స్​డ్ విభాగంలో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. టోర్నీలో మనకు ఇది రెండో బంగారు పతకం. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్​ పిస్టోల్​ ఎస్​హెచ్1 విభాగంలో సింగ్​రాజ్ ఈ మెడల్ సాధించాడు.

2019లో జరిగిన ప్రపంచ ఛాంపియన్​షిప్​లో కాంస్యం సాధించిన నర్వాల్.. 229.1 పాయింట్లు తెచ్చుకుని స్వర్ణం అందుకున్నాడు. రెండో స్థానంలో నిలిచిన జవన్​మర్ది(223.4).. మనీశ్ కంటే 5.7 పాయింట్ల తక్కువ సాధించాడు.

మరోవైపు దిల్లీలో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్​లో మన దేశానికి చెందిన ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్.. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ విభాగంలో బంగారు పతకం తెచ్చుకున్నాడు.

Aishwary Pratap Singh Tomar
ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్

ఇవీ చదవండి:

యూఏఈలో జరుగుతున్న షూటింగ్ పారా ప్రపంచకప్​లో భారత షూటర్​ మనీశ్ నర్వాల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీనితో పాటే 50 మీటర్ల పిస్టోల్​ మిక్స్​డ్ విభాగంలో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. టోర్నీలో మనకు ఇది రెండో బంగారు పతకం. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్​ పిస్టోల్​ ఎస్​హెచ్1 విభాగంలో సింగ్​రాజ్ ఈ మెడల్ సాధించాడు.

2019లో జరిగిన ప్రపంచ ఛాంపియన్​షిప్​లో కాంస్యం సాధించిన నర్వాల్.. 229.1 పాయింట్లు తెచ్చుకుని స్వర్ణం అందుకున్నాడు. రెండో స్థానంలో నిలిచిన జవన్​మర్ది(223.4).. మనీశ్ కంటే 5.7 పాయింట్ల తక్కువ సాధించాడు.

మరోవైపు దిల్లీలో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్​లో మన దేశానికి చెందిన ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్.. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ విభాగంలో బంగారు పతకం తెచ్చుకున్నాడు.

Aishwary Pratap Singh Tomar
ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.