ETV Bharat / sports

కెప్టెన్‌గా రిషభ్​ పంత్‌ సరైన ప్రత్యామ్నాయం: పాంటింగ్​

కెప్టెన్‌గా రిషభ్​ కెప్టెన్సీపై దిల్లీ జట్టు ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్​ స్పందించారు. పంత్​ ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడని, కెప్టెన్‌గా అతడే సరైన ప్రత్యామ్నాయమన్నారు.

author img

By

Published : May 23, 2022, 6:59 AM IST

Updated : May 23, 2022, 12:46 PM IST

Rishabh Pant
రిషభ్​ పంత్‌

రిషభ్​ పంత్‌ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని దిల్లీ కెప్టెన్‌గా అతడు సరైన ప్రత్యామ్నాయమని ఆ జట్టు ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. ఈ సీజన్‌లో పంత్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై అభిమానుల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో పాంటింగ్‌ ఇలా వ్యాఖ్యానించాడు. ''దిల్లీకి కెప్టెన్‌ రిషభ్​ పంత్‌ సరైన ప్రత్యామ్నాయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత సీజన్లో శ్రేయస్‌ అయ్యర్‌ నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్న తర్వాత దిల్లీని రిషభ్​సమర్థంగా నడిపించాడు. రిషభ్​ ఇంకా కుర్రాడే. సారథ్యంలో లోటుపాట్లను ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాడు. ఇలాంటి లీగ్‌లో తీవ్రమైన ఒత్తిడి ఉంటే టోర్నీలో సారథ్యం అంత సులభం కాదు. మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయాన్ని అంతా నిశితంగా గమనిస్తారు. అందుకే పంత్‌కు మద్దతు ఇస్తున్నా'' అని రికీ చెప్పాడు. ముంబయితో మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన పంత్‌ ఒక్కడినే నిందించడం తగదని.. టాప్‌ ఆర్డర్‌ వైఫల్యం కూడా ఓ కారణమని పాంటింగ్‌ అన్నాడు. ''ముంబయితో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లలో మ్యాచ్‌ మా చేజారిపోయింది. ఇందుకు కెప్టెన్‌ పంత్‌ను ఒక్కడినే బాధ్యుడిని చేయలేం. మా టాప్‌ ఆర్డర్‌ వైఫల్యం వల్లే జట్టు సరైన స్కోరు చేయలేకపోయింది. ఈ సీజన్లో మా బ్యాటర్లు స్థిరంగా రాణించలేకపోయారు'' రికీ పేర్కొన్నాడు.

వద్దనుకునే వదిలేశాం: పంత్​

ముంబయితో మ్యాచ్‌లో టిమ్‌ డేవిడ్‌ బ్యాట్‌ అంచుకు బంతి తాకలేదని సమీపంలో ఫీల్డింగ్‌ చేస్తున్నవాళ్లు చెప్పడంతోనే సమీక్షకు వెళ్లకుండా ఆగిపోయానని చెప్పాడు దిల్లీ కెప్టెన్‌ రిషభ్​పంత్‌. ''మొదట బంతి డేవిడ్‌ బ్యాట్‌ అంచుకు తాకినట్లు అనిపించింది. సమీక్షకు వెళ్లాలా అని సమీపంలో ఫీల్డర్లను అడిగాను. కానీ వాళ్లెవరూ సముఖత చూపించలేదు. అందుకే రివ్యూ తీసుకోలేదు'' అని రిషభ్​సమీక్షకు వెళ్లకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో డేవిడ్‌ బ్యాట్‌కు బంతి తగిలే సమయానికి ముంబయి 33 బంతుల్లో 65 పరుగులు చేయాల్సి ఉంది. అయితే బంతి తాకినట్లు మైదానంలో అంపైర్‌ తపన్‌శర్మ గుర్తించలేకపోయాడు. దిల్లీ కెప్టెన్‌ పంత్‌ కూడా సమీక్ష తీసుకోలేదు. కానీ ఈ తప్పే దిల్లీని ప్లేఆఫ్స్‌కు వెళ్లకుండా అడ్డుకుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ డేవిడ్‌.. ఆ తర్వాత 10 బంతుల్లోనే 34 పరుగులు చేసి మ్యాచ్‌ను ముంబయి వైపు తిప్పేశాడు.

ఇదీ చదవండి: ఉమ్రాన్​పై ప్రశంసల వెల్లువ... తండ్రి భావోద్వేగం

రిషభ్​ పంత్‌ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని దిల్లీ కెప్టెన్‌గా అతడు సరైన ప్రత్యామ్నాయమని ఆ జట్టు ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. ఈ సీజన్‌లో పంత్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై అభిమానుల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో పాంటింగ్‌ ఇలా వ్యాఖ్యానించాడు. ''దిల్లీకి కెప్టెన్‌ రిషభ్​ పంత్‌ సరైన ప్రత్యామ్నాయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత సీజన్లో శ్రేయస్‌ అయ్యర్‌ నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్న తర్వాత దిల్లీని రిషభ్​సమర్థంగా నడిపించాడు. రిషభ్​ ఇంకా కుర్రాడే. సారథ్యంలో లోటుపాట్లను ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాడు. ఇలాంటి లీగ్‌లో తీవ్రమైన ఒత్తిడి ఉంటే టోర్నీలో సారథ్యం అంత సులభం కాదు. మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయాన్ని అంతా నిశితంగా గమనిస్తారు. అందుకే పంత్‌కు మద్దతు ఇస్తున్నా'' అని రికీ చెప్పాడు. ముంబయితో మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన పంత్‌ ఒక్కడినే నిందించడం తగదని.. టాప్‌ ఆర్డర్‌ వైఫల్యం కూడా ఓ కారణమని పాంటింగ్‌ అన్నాడు. ''ముంబయితో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లలో మ్యాచ్‌ మా చేజారిపోయింది. ఇందుకు కెప్టెన్‌ పంత్‌ను ఒక్కడినే బాధ్యుడిని చేయలేం. మా టాప్‌ ఆర్డర్‌ వైఫల్యం వల్లే జట్టు సరైన స్కోరు చేయలేకపోయింది. ఈ సీజన్లో మా బ్యాటర్లు స్థిరంగా రాణించలేకపోయారు'' రికీ పేర్కొన్నాడు.

వద్దనుకునే వదిలేశాం: పంత్​

ముంబయితో మ్యాచ్‌లో టిమ్‌ డేవిడ్‌ బ్యాట్‌ అంచుకు బంతి తాకలేదని సమీపంలో ఫీల్డింగ్‌ చేస్తున్నవాళ్లు చెప్పడంతోనే సమీక్షకు వెళ్లకుండా ఆగిపోయానని చెప్పాడు దిల్లీ కెప్టెన్‌ రిషభ్​పంత్‌. ''మొదట బంతి డేవిడ్‌ బ్యాట్‌ అంచుకు తాకినట్లు అనిపించింది. సమీక్షకు వెళ్లాలా అని సమీపంలో ఫీల్డర్లను అడిగాను. కానీ వాళ్లెవరూ సముఖత చూపించలేదు. అందుకే రివ్యూ తీసుకోలేదు'' అని రిషభ్​సమీక్షకు వెళ్లకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో డేవిడ్‌ బ్యాట్‌కు బంతి తగిలే సమయానికి ముంబయి 33 బంతుల్లో 65 పరుగులు చేయాల్సి ఉంది. అయితే బంతి తాకినట్లు మైదానంలో అంపైర్‌ తపన్‌శర్మ గుర్తించలేకపోయాడు. దిల్లీ కెప్టెన్‌ పంత్‌ కూడా సమీక్ష తీసుకోలేదు. కానీ ఈ తప్పే దిల్లీని ప్లేఆఫ్స్‌కు వెళ్లకుండా అడ్డుకుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ డేవిడ్‌.. ఆ తర్వాత 10 బంతుల్లోనే 34 పరుగులు చేసి మ్యాచ్‌ను ముంబయి వైపు తిప్పేశాడు.

ఇదీ చదవండి: ఉమ్రాన్​పై ప్రశంసల వెల్లువ... తండ్రి భావోద్వేగం

Last Updated : May 23, 2022, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.