ETV Bharat / sports

ఆ ప్రతిష్ఠాత్మక అవార్డ్​ రేసులో ఉన్న ఆటగాళ్లు వీరే - బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్‌ ది ఇయర్ అవార్డుకు రాణి రాంపాల్​

భారత ఉత్తమ మహిళా క్రీడాకారుల సేవలను గుర్తించేందుకు బీబీసీ ఏటా ప్రకటించే ప్రతిష్ఠాత్మక 'ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్‌ ది ఇయర్' అవార్డుకు ఈ సారి భారత మహిళా హాకీ జట్టు సారథి రాణి రాంపాల్​​, చెస్​ ప్లేయర్​ కోనేరు హంపీ, యువ షూటర్​ మను బాకర్​ను నామినేట్​ అయ్యారు. విజేతను ఎంపిక చేసే ఓటింగ్​ ప్రక్రియ ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభంకానుంది.

rani
రాణి రాంపాల్​
author img

By

Published : Feb 8, 2021, 7:27 PM IST

ఈ ఏడాదిగానూ ప్రతిష్టాత్మక 'ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్‌ ది ఇయర్' అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను బీబీసీ ప్రకటించింది. ఇందులో భారత మహిళ హాకీ జట్టు సారథి రాణి రాంపాల్​​, చెస్​ ప్లేయర్​ కోనేరు హంపీ, యువ షూటర్​ మను బాకర్ ఉన్నారు. ఈ రేసులో మహిళా రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్, స్ప్రింటర్‌ ద్యుతి చంద్ కూడా​​ ఉన్నారు.

విజేతను ఎలా ప్రకటిస్తారు?

ఫిబ్రవరి 24న ఓటింగ్​ ప్రారంభంకానుంది. అభిమానులు బీబీసీ భారతీయ భాషల వెబ్‌సైట్లలో దేనికైనా వెళ్లి నామినేట్​ అయిన ఆటగాళ్ల జాబితాలోని తమకు నచ్చిన క్రీడాకారిణికి ఓటు వేయవచ్చు. అత్యధిక ఓట్లు పొందిన క్రీడాకారిణి 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ ఉమన్ ఆఫ్‌ ది ఇయర్' పురస్కారాన్ని సొంతం చేసుకుంటుంది. ఈ విజేతలను ఎంపిక చేసేందుకు బీబీసీ ఓ జ్యూరీని రూపొందించింది. ఆ జ్యూరీలో దేశంలోని కొందరు ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, రచయితలు ఉన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు విజేతను ప్రకటిస్తారు.

అయితే ఈ ఏడాది పురస్కారం అందించడంలో భాగంగా 'ఎమర్జింగ్​ ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​' పేరుతో మరో కొత్త కేటగిరీని ప్రవేశపెట్టింది బీబీసీ. అయితే ఇందులో విజేతలను ఓటింగ్​ ద్వారా కాకుండా కేవలం జ్యూరీలోని సభ్యులు ఎంపిక చేస్తారు.

ఎందుకీ అవార్డు

భారత ఉత్తమ మహిళా క్రీడాకారుల (పారా అథ్లెట్లు సహా) సేవలను గుర్తించేందుకు, మరింత ఎక్కువ మంది మహిళలు, యువత ఆటల్లో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు బీబీసీ మొదటిసారిగా ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారాన్ని 2019లో ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ అవార్డు ప్రదానోత్సవం కొనసాగుతోంది.

ఇదీ చూడండి : 'ఐసీసీ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​'గా పంత్​

ఈ ఏడాదిగానూ ప్రతిష్టాత్మక 'ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్‌ ది ఇయర్' అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను బీబీసీ ప్రకటించింది. ఇందులో భారత మహిళ హాకీ జట్టు సారథి రాణి రాంపాల్​​, చెస్​ ప్లేయర్​ కోనేరు హంపీ, యువ షూటర్​ మను బాకర్ ఉన్నారు. ఈ రేసులో మహిళా రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్, స్ప్రింటర్‌ ద్యుతి చంద్ కూడా​​ ఉన్నారు.

విజేతను ఎలా ప్రకటిస్తారు?

ఫిబ్రవరి 24న ఓటింగ్​ ప్రారంభంకానుంది. అభిమానులు బీబీసీ భారతీయ భాషల వెబ్‌సైట్లలో దేనికైనా వెళ్లి నామినేట్​ అయిన ఆటగాళ్ల జాబితాలోని తమకు నచ్చిన క్రీడాకారిణికి ఓటు వేయవచ్చు. అత్యధిక ఓట్లు పొందిన క్రీడాకారిణి 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ ఉమన్ ఆఫ్‌ ది ఇయర్' పురస్కారాన్ని సొంతం చేసుకుంటుంది. ఈ విజేతలను ఎంపిక చేసేందుకు బీబీసీ ఓ జ్యూరీని రూపొందించింది. ఆ జ్యూరీలో దేశంలోని కొందరు ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, రచయితలు ఉన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు విజేతను ప్రకటిస్తారు.

అయితే ఈ ఏడాది పురస్కారం అందించడంలో భాగంగా 'ఎమర్జింగ్​ ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​' పేరుతో మరో కొత్త కేటగిరీని ప్రవేశపెట్టింది బీబీసీ. అయితే ఇందులో విజేతలను ఓటింగ్​ ద్వారా కాకుండా కేవలం జ్యూరీలోని సభ్యులు ఎంపిక చేస్తారు.

ఎందుకీ అవార్డు

భారత ఉత్తమ మహిళా క్రీడాకారుల (పారా అథ్లెట్లు సహా) సేవలను గుర్తించేందుకు, మరింత ఎక్కువ మంది మహిళలు, యువత ఆటల్లో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు బీబీసీ మొదటిసారిగా ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారాన్ని 2019లో ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ అవార్డు ప్రదానోత్సవం కొనసాగుతోంది.

ఇదీ చూడండి : 'ఐసీసీ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​'గా పంత్​

For All Latest Updates

TAGGED:

Rani Humpy
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.