సుశీల్ కుమార్ను తన విధుల నుంచి భారతీయ రైల్వే శాఖ సస్పెండ్ చేసింది. ఛత్రసాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుశీల్ను ఇటీవలే దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ. మరో ప్రకటన చేసేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర రైల్వే స్పష్టం చేసింది. నార్తర్న్ రైల్వేలో సీనియర్ కమర్షియల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు సుశీల్.
వేచి చూస్తున్నాం..
సుశీల్ అరెస్టుపై భారత రెజ్లింగ్ ఫెడరేషన్(డబ్ల్యూఎఫ్ఐ) సహాయక కార్యదర్శి వినోద్ తోమర్ స్పందించారు. ఇది ఘటన క్రీడకు మచ్చలాంటిదని అభిప్రాయపడ్డారు. "ఈ పరిణామం ప్రత్యేకంగా రెజ్లింగ్కు మంచిది కాదు. దేశంలో రెజ్లింగ్ అభివృద్ధి కావడానికి అతడు ఎంతో కృషి చేశాడు. అతన్ని ప్రేరణగా తీసుకుని చాలా మంది రెజ్లింగ్ను కెరీర్గా ఎంచుకున్నారు. ప్రస్తుతానికి అతనిపై దర్యాప్తు కొనసాగుతోంది. సుశీల్ దోషి.. అవునా? కాదా? అనే విషయం తేలాల్సి ఉంది. కాబట్టి అతనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే డబ్ల్యూఎఫ్ఐ చీఫ్తో సమావేశమవుతాం" అని వినోద్ తెలిపారు.