చైనా బీజింగ్లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనుబాకర్-సౌరభ్ చౌదరి జోడి స్వర్ణాన్ని నెగ్గింది. చైనాకు చెందిన జియాంగ్ - పాంగ్ వీ ద్వయంపై 16-6 తేడాతో గెలిచింది.
అర్హత పోటీలో 482 పాయింట్లే సాధించిన మనుబాకర్, సౌరబ్... ఫైనల్స్లో మాత్రం సత్తా చాటి పసిడి కైవసం చేసుకున్నారు. 483.5 పాయింట్ల వద్ద ముగించి అందరికంటే ముందు నిలిచారు. ఈ టోర్నీలో భారత్కు ఇది రెండో స్వర్ణం. అంజుమ్- దివ్యాంశ్ జోడి ఈరోజు తొలి స్వర్ణాన్ని గెలిచింది.
ఈ ఏడాది ప్రారంభంలో న్యూదిల్లీ షూటింగ్ ప్రపంచకప్లోనూ మనుబాకర్- సౌరభ్ ద్వయం బంగారు పతకాన్ని గెలిచింది. ఈ టోర్నీలో పురషుల సింగిల్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోనూ గోల్డ్ గెలిచాడు 16 ఏళ్ల సౌరభ్ చౌదరి.