ETV Bharat / sports

విశ్వక్రీడల వాయిదా ఖరీదెంత!

author img

By

Published : Mar 28, 2020, 8:19 AM IST

కరోనా.. ఏ నోట విన్నా ఇదే మాట. ప్రపంచమంతా ఈ వైరస్‌ కల్లోలమే. ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరం ఒలింపిక్స్‌కూ కరోనా దెబ్బ తప్పలేదు. ఈ మహమ్మారి కారణంగా 2020 ఒలింపిక్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. అంతవరకు సరే. మరి ఆలస్యం ఖరీదెంత? ఆ భారం మోసేదెవరు? ఆ నష్టం భరించేదెవరు?

postponement cost to olympics
వాయిదా ఖరీదెంత

కరోనా ప్రభావానికి చాలావరకు టోర్నీలు రద్దయ్యాయి. విశ్వక్రీడల సంబరం సైతం ఈ ఏడాది లేకుండా పోయింది. 2020 ఒలింపిక్స్​ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అయితే ఈ ఆలస్యం వల్ల జరిగే నష్టమేంటి? నష్టాన్ని భరించేదెవరు? అసలు ఈ ఆలస్యం ఖరీదెంత?

టోక్యో ఒలింపిక్స్‌ కోసం రూ.94,000 కోట్లను వెచ్చించనున్నట్లు మొదట్లో ప్రకటించారు. అయితే 2019, డిసెంబరులో జపాన్‌ ప్రభుత్వ ఆడిట్‌ ప్రకారం ఖర్చు రూ.2.10 లక్షల కోట్లుగా తేలింది. కొత్తగా నిర్మించిన స్టేడియం వ్యయమే రూ.10,500 కోట్లు!

స్పాన్సర్​షిప్​కు రికార్డు స్థాయిలో

ఒలింపిక్స్‌ నిర్వాహకులు స్థానిక స్పాన్సర్‌షిప్‌ హక్కుల్ని రికార్డు స్థాయిలో రూ.25,000 కోట్లకు అమ్మారు. గత ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈ స్పాన్సర్‌షిప్‌ మొత్తం రెండు రెట్లు. భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించిన బ్రాండ్స్‌.. తమకేం లభిస్తుందో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. ఒప్పందాలపై అయోమయం నెలకొంది.

అంచనాలు తలకిందులు

టోక్యో ఒలింపిక్స్‌ టికెట్ల అమ్మకం ద్వారా రూ.580 కోట్లు ఆదాయం రాబట్టాలని నిర్వాహకులు భావించారు. అయితే ఒక్కో టికెట్‌ ధర 10 రెట్ల కన్నా ఎక్కువ పలుకుతుండటం వల్ల స్థానిక నిర్వాహకులు రూ.7,500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇప్పుడా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఇప్పటికే అమ్ముడైన టికెట్ల కోసం తీసుకున్న డబ్బులు వెనక్కివాల్సిన పరిస్థితి తలెత్తింది.

3,500 మంది సిబ్బంది

స్టేడియాలు, వేదికల నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడు కానున్నాయి. నిర్వహణ సంస్థలతో లీజు ఒప్పందాల్ని పునరుద్ధరించుకోవాలి. నిర్వహణ సంస్థలతో సంబంధం లేకుండా స్టేడియాలు, వేదికల పర్యవేక్షణ కోసం నిర్వాహక కమిటీ సొంతంగా 3500 మంది సిబ్బందిని నియమించింది. ఖర్చు తగ్గించుకునే క్రమంలో ఎంతమంది ఉద్యోగాలు ఊడుతాయో తెలియదు!

42 వేదికలు

ఒలింపిక్స్‌ను 42 వేదికల్లో నిర్వహించాలని నిర్ణయించారు. పారాలింపిక్స్‌ కోసం అదనంగా మరో వేదికను సిద్ధం చేయాల్సి ఉంది. అయితే ఏడాది తర్వాత స్టేడియాల పరిస్థితి ఎలా ఉంటుందో? ఎన్ని స్టేడియాలు అందుబాటులో ఉంటాయో తెలియని పరిస్థితి. ఏడాది పాటు ఏర్పాట్లను అలాగే కొనసాగించడం ఖర్చుతో కూడుకున్న పనే.

రూ.20,000 కోట్లు

జపాన్‌ వాణిజ్య వార్తా పత్రిక నిక్కీ నివేదిక ప్రకారం ఒలింపిక్స్‌ను ఏడాది వాయిదా వేయడం వల్ల అదనంగా రూ.20 వేల కోట్ల భారం పడుతుందని అంచనా.

5632 ఫ్లాట్లు

ఒలింపిక్స్‌ నిర్వాహకులకు అతి పెద్ద సవాల్‌ విసురుతోంది క్రీడాగ్రామం. 11,000 మంది ఒలింపియన్లు, సిబ్బంది.. 4,400 మంది పారాలింపియన్లు, సిబ్బందికి వసతి కల్పించేందుకు 5632 ఫ్లాట్లను సిద్ధం చేశారు. ఒలింపిక్స్‌ తర్వాత వీటిని అమ్మాలన్నది ఆలోచన. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఏడాది పాటు ఈ నిధుల గురించి మరిచిపోవాల్సిందే. ఇప్పటికే అమ్ముడైన పావు వంతు అపార్ట్‌మెంట్ల సంగతి అగమ్యగోచరం.

ఐఓసీ సురక్షితం

ఒలింపిక్స్‌ నిర్వహణ కోసం అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) తన వంతుగా రూ.9,700 కోట్లు ఆర్థిక సహాయం టోక్యోకు అందించింది. గత ఒలింపిక్స్‌ సైకిల్‌ (2013-2016 మధ్య కాలం)లో రూ.4,250 కోట్ల ఆదాయం ఐఓసీకి లభించింది. ఇందులో మూడొంతులు ప్రసార హక్కుల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బే. 18 శాతం స్పాన్సర్ల ద్వారా లభించిన మొత్తం. ప్రస్తుతం ఐఓసీ దగ్గర రూ.15,000 కోట్ల నిధులు ఉన్నాయి. నష్టాల భర్తీకి బీమాలూ ఉండటంతో ఐఓసీకి వచ్చిన కష్టమేమీ లేదు! భారం మోయాల్సింది జపాన్‌ ప్రభుత్వమే.

కరోనా ప్రభావానికి చాలావరకు టోర్నీలు రద్దయ్యాయి. విశ్వక్రీడల సంబరం సైతం ఈ ఏడాది లేకుండా పోయింది. 2020 ఒలింపిక్స్​ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అయితే ఈ ఆలస్యం వల్ల జరిగే నష్టమేంటి? నష్టాన్ని భరించేదెవరు? అసలు ఈ ఆలస్యం ఖరీదెంత?

టోక్యో ఒలింపిక్స్‌ కోసం రూ.94,000 కోట్లను వెచ్చించనున్నట్లు మొదట్లో ప్రకటించారు. అయితే 2019, డిసెంబరులో జపాన్‌ ప్రభుత్వ ఆడిట్‌ ప్రకారం ఖర్చు రూ.2.10 లక్షల కోట్లుగా తేలింది. కొత్తగా నిర్మించిన స్టేడియం వ్యయమే రూ.10,500 కోట్లు!

స్పాన్సర్​షిప్​కు రికార్డు స్థాయిలో

ఒలింపిక్స్‌ నిర్వాహకులు స్థానిక స్పాన్సర్‌షిప్‌ హక్కుల్ని రికార్డు స్థాయిలో రూ.25,000 కోట్లకు అమ్మారు. గత ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈ స్పాన్సర్‌షిప్‌ మొత్తం రెండు రెట్లు. భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించిన బ్రాండ్స్‌.. తమకేం లభిస్తుందో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. ఒప్పందాలపై అయోమయం నెలకొంది.

అంచనాలు తలకిందులు

టోక్యో ఒలింపిక్స్‌ టికెట్ల అమ్మకం ద్వారా రూ.580 కోట్లు ఆదాయం రాబట్టాలని నిర్వాహకులు భావించారు. అయితే ఒక్కో టికెట్‌ ధర 10 రెట్ల కన్నా ఎక్కువ పలుకుతుండటం వల్ల స్థానిక నిర్వాహకులు రూ.7,500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇప్పుడా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఇప్పటికే అమ్ముడైన టికెట్ల కోసం తీసుకున్న డబ్బులు వెనక్కివాల్సిన పరిస్థితి తలెత్తింది.

3,500 మంది సిబ్బంది

స్టేడియాలు, వేదికల నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడు కానున్నాయి. నిర్వహణ సంస్థలతో లీజు ఒప్పందాల్ని పునరుద్ధరించుకోవాలి. నిర్వహణ సంస్థలతో సంబంధం లేకుండా స్టేడియాలు, వేదికల పర్యవేక్షణ కోసం నిర్వాహక కమిటీ సొంతంగా 3500 మంది సిబ్బందిని నియమించింది. ఖర్చు తగ్గించుకునే క్రమంలో ఎంతమంది ఉద్యోగాలు ఊడుతాయో తెలియదు!

42 వేదికలు

ఒలింపిక్స్‌ను 42 వేదికల్లో నిర్వహించాలని నిర్ణయించారు. పారాలింపిక్స్‌ కోసం అదనంగా మరో వేదికను సిద్ధం చేయాల్సి ఉంది. అయితే ఏడాది తర్వాత స్టేడియాల పరిస్థితి ఎలా ఉంటుందో? ఎన్ని స్టేడియాలు అందుబాటులో ఉంటాయో తెలియని పరిస్థితి. ఏడాది పాటు ఏర్పాట్లను అలాగే కొనసాగించడం ఖర్చుతో కూడుకున్న పనే.

రూ.20,000 కోట్లు

జపాన్‌ వాణిజ్య వార్తా పత్రిక నిక్కీ నివేదిక ప్రకారం ఒలింపిక్స్‌ను ఏడాది వాయిదా వేయడం వల్ల అదనంగా రూ.20 వేల కోట్ల భారం పడుతుందని అంచనా.

5632 ఫ్లాట్లు

ఒలింపిక్స్‌ నిర్వాహకులకు అతి పెద్ద సవాల్‌ విసురుతోంది క్రీడాగ్రామం. 11,000 మంది ఒలింపియన్లు, సిబ్బంది.. 4,400 మంది పారాలింపియన్లు, సిబ్బందికి వసతి కల్పించేందుకు 5632 ఫ్లాట్లను సిద్ధం చేశారు. ఒలింపిక్స్‌ తర్వాత వీటిని అమ్మాలన్నది ఆలోచన. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఏడాది పాటు ఈ నిధుల గురించి మరిచిపోవాల్సిందే. ఇప్పటికే అమ్ముడైన పావు వంతు అపార్ట్‌మెంట్ల సంగతి అగమ్యగోచరం.

ఐఓసీ సురక్షితం

ఒలింపిక్స్‌ నిర్వహణ కోసం అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) తన వంతుగా రూ.9,700 కోట్లు ఆర్థిక సహాయం టోక్యోకు అందించింది. గత ఒలింపిక్స్‌ సైకిల్‌ (2013-2016 మధ్య కాలం)లో రూ.4,250 కోట్ల ఆదాయం ఐఓసీకి లభించింది. ఇందులో మూడొంతులు ప్రసార హక్కుల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బే. 18 శాతం స్పాన్సర్ల ద్వారా లభించిన మొత్తం. ప్రస్తుతం ఐఓసీ దగ్గర రూ.15,000 కోట్ల నిధులు ఉన్నాయి. నష్టాల భర్తీకి బీమాలూ ఉండటంతో ఐఓసీకి వచ్చిన కష్టమేమీ లేదు! భారం మోయాల్సింది జపాన్‌ ప్రభుత్వమే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.