శనివారం, భారత హాకీ మాజీ ఆటగాడు రవీందర్ పాల్ సింగ్ కొవిడ్తో మరణించిన కొద్ది గంటల్లోనే మరో హాకీ మాజీ ఆటగాడు, కోచ్ ఎమ్కే కౌషిక్(66) వైరస్తో పోరాడుతూ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడాప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
కౌషిక్.. 1998లో అర్జున, 2002లో ద్రోణాచార్య అవార్డులను అందుకున్నారు. 1980 మాస్కో ఒలింపిక్స్లో స్వర్ణ పతకాన్ని సాధించారు. భారత పురుషుల, మహిళ హాకీ జట్లకు కోచ్గా వ్యవహరించారు. ఆయన ఆధ్వర్యంలో 1998 బ్యాంకాంక్లో జరిగిన ఆసియన్ గేమ్స్లో పురుషుల జట్టు గెలుపొందగా.. 2006 దోహా ఆసియన్ గేమ్స్లో మహిళల జట్టు కాంస్య పతకాన్ని అందుకుంది.
ఇదీ చూడండి: కరోనాతో భారత హాకీ మాజీ ఆటగాడు మృతి